)
Auto driver brutally attacks on Tirumala pilgrims: తిరుమలలో ఇటీవల భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా మన దేశం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో పొటెత్తిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. మరోవైపు.. తిరుమలలో ప్రతిరోజు కూడా భారీగా భక్తులు రావడంతో కంపార్ట్ మెంట్ లు అన్ని ఫుల్గా ఉంటున్నాయి. శిలాతోరణం వరకు కూడా క్యూలైన్ లు ఉంటున్నాయి.
ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తుల్నికొంత మంది టికెట్లపేరుతో ఆటోవాలాలు మోసం చేస్తున్నారు. కొంత మంది తిరుపతిలో రైల్వేస్టేషన్ సమీపంలోని ఆటోవాలాలు అధిక చార్జీల్ని కూడా వసూలు చేస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే.. నోటికొచ్చినట్లు మాట్లాడి కొంత మంది దాడులు చేయడానికి సైతం వెనుకాడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక అమానవీకర ఘటన వార్తలలో నిలిచింది.
శ్రీవారి దర్శనార్థం కొంత మంది భక్తులు వచ్చారు. రైల్వే స్టేషన్ స్టాండ్ లో ఉన్న ఆటో వాలా తన ఆటోలో ఎక్కాలని భక్తుల్ని అడిగాడు. దీనికి వారు నిరాకరించి బస్సు స్టాప్ దగ్గరకు వెళ్లారు. ఇంతలో ఆటోవాలా తనను పట్టించుకోకుండా వెళ్తారా అని భక్తులపై దాడికి దిగాడు. పబ్లిక్ గా రెచ్చిపోయి మరీ.. శ్రీవారి మెట్టుకు వెళ్లే బస్సు స్టాప్ వద్ద ఆటో డ్రైవర్ భక్తులపై దాడిచేశారు. దీంతో పాపం.. భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
స్వామి వారి దర్శనం కోసం వస్తే.. ఇలా ఏంటని కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడున్న వారు డ్రైవర్ ను విడిపించారు. ఈ క్రమంలో కొంత మంది ఈ ఘటనను తీరిగ్గా వీడియో తీస్తు ఉండిపోయారు. మరికొంత మంది వచ్చి వారిని సముదాయించే పనులు చేశారు. ఆ తర్వాత అక్కడున్న పోలీసులు సీన్ లో ఎంట్రీ ఇచ్చి ఆటోవాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారి ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook