Tirumala: పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో పాడుపని.. రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన ఉద్యోగి.. ఏం చేశాడంటే..?

Tirumala parakamani: పవిత్రమైన తిరుమలలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అసలు ఈ పనిచేసేందుకు చేతులేలా వచ్చాయని భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 12, 2025, 01:00 PM IST
  • తిరుమల పరాకమణిలో చోరీకి యత్నం..
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీటీడీ సిబ్బంది..
Tirumala: పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో పాడుపని.. రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన ఉద్యోగి.. ఏం చేశాడంటే..?

Theft in tirumala parakamani: తిరుమల శ్రీవారిని పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. భక్తులు తమ కొంగు బంగారంగా భావిస్తారు. అందుకే స్వామి వారి దర్శనం కోసం వందల కిలో మీటర్ల దూరం నుంచి వస్తుంటారు. ఎన్నిగంటలైన.. ఎంత మంది జనాలున్న కూడా... కంపార్ట్ మెంట్లలో వేచి చూసి.. ఆ దేవ దేవుడి దర్శనం కోసం పరితపిస్తుంటారు.  అలాంటి తిరుమలలో ఇటీవల కాలంలో అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కలి ప్రభావమో.. మరేంటో కానీ.. ఇటీవల తిరుమలలో ఎప్పుడు కూడా జరగని ఘటనలు... అస్సలు ఊహించని విషాదాలు వార్తలలో ఉంటున్నారు.

Add Zee News as a Preferred Source

తిరుమలలో లడ్డు వివాదం ఎంతో వివాదంగా మారిందో తెలిసిందే. ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.  ఆతర్వాత కొంత మంది పవిత్రమైన మాడ వీధుల్లో.. చెప్పులు వేసుకునినడవడం, రీల్స్ చేయడం వివాదంగా మారింది. కొంతమంది రాజకీయ  నాయకులు టీటీడీ గురించి, రాజకీయాల గురించి మాట్లాడి వివాదాలు రాజేశారు. మరోవైపు ఇటీవల వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణి సమయంలో జరిగిన ఘోరంమాత్రం.. తిరుమల చరిత్రలో ఒక మచ్చగా చెప్పుకొవచ్చు.

ముఖ్యంగా టీటీడీ అధికారులు, పోలీసులు మాత్రం పూర్తిగా సమన్వయం చేసుకొవడంలో విఫలమయ్యారని స్పష్టంగా కన్పిస్తుంది. అయితే.. ప్రస్తుతం తిరుమలకు ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు.అంతే కాకుండా.. తిరుమల హుండీలో.. కొంత మంది నిలువు దోపిడి, బంగారం, వెండి, వజ్రాలు, ఇలా తమకు తోచిన విధంగా హుండీలో వేస్తుంటారు. ఇదంతా.. టీటీడీ సిబ్బంది పరకామణిలో ఉంచి లెక్కగడుతుంటారు. పరకామణిలో శ్రీవారికి వచ్చిన డబ్బులు, ఆదాయం లెక్కగట్టేందుకు కూడా ప్రత్యేకంగా సేవలు చేసేందుకు చాలా మంది ముందుకొస్తుంటారు.

ఈ నేపథ్యంలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన పని మాత్రం అందర్ని షాకింగ్ కు గురిచేసిందని చెప్పుకొవచ్చు. శ్రీవారి ఆలయంలో పరకామణిలో సేవచేసేందుకు వచ్చిన ఒక బ్యాంక్ ఉద్యోగి.. శ్రీవారి బంగారం బిస్కట్ ను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. పెంచలయ్య అనే బ్యాంక్ ఉద్యోగి.. వంద గ్రాముల బంగారంను  తీసుకుని.. వ్యర్థాలను పడేసే ట్రాలీలో సీక్రెట్ గా వేసేందుకు ప్రయత్నించాడు.

Read more: Tirumala: అలిపిరిలో మళ్లీ చిరుత హల్ చల్.. టీటీడీ ఉద్యోగికి తీవ్ర గాయాలు.. అసలేం జరిగిందంటే..?

దీంతో అక్కడున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గమనించాడు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని తిరుమలలో రెండో టౌన్ పీఎస్ కు తరలించారు.  ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి ఆలయంలో సేవచేసేందుకు వచ్చి.. స్వామికే శఠగోపం పెట్టేందుకు ప్రయత్నించడం ఏంటనికూడా భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News