
YSRCP Support To NDA Candidate: దేశవ్యాప్తంగా ఉప రాష్ట్రపతి ఎన్నికపై అందరి దృష్టి ఉంది. ఎన్డీయే కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండి కూటమి నుంచి తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ, వైస్సార్సీపీ మద్దతు కీలకంగా మారింది. ఈ రెండు పార్టీలు ఎటు ఓటు వేస్తాయనేది ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నుంచి ఉత్కంఠ వీడింది. అనూహ్యంగా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
'రాజ్యాంగ పదవులకు నంబర్ గేమ్ ఉండరాదనేది వైఎస్సార్సీపీ విధానం. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి వైఎస్ జగన్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే విధానంతో ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తాం' అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థనను తిరస్కరించి.. పరిగణలోకి తీసుకునేది కాదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రామ నామస్మరణలా ప్రతి విషయానికి వైసీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు అడ్డుకోవడం లేదు' అని బొత్స ప్రశ్నించారు. 16 సార్లు ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏం సాధించారని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు వైసీపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు.
ఈనెల 25న రాజమండ్రిలో జరగాల్సిన మాజీ సీఎం జగన్ పర్యటన వాయిదా పడిందిన బొత్స సత్యనారాయణ తెలిపారు. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో కూర్చుని ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. 'ప్రధాని యోగా దినోత్సవంతో విశాఖకు ఏమీ ఉపయోగం జరగలేదు. పవన్ కల్యాణ్ సీజ్ ద షిప్ ఏమైంది. రేషన్ బియ్యం మాఫియా ఐదేళ్లలో కొంత జరిగితే ఇప్పుడు పదిరెట్లు పెరిగింది. వైజాగ్లో మూడు సార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి' అని వివరించారు.
ఏపీకి మూడు రాజధానులు సున్నితమైన అంశమని.. తమ పార్టీలో మూడు రాజధానిపై చర్చించుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ లేకపోవడం, ప్రజల పట్ల బాధ్యతరాహిత్యం కారణంగా కూటమి ప్రభుత్వం 16 నెలలుగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.