)
Pournami garuda seva cancelled in Tirumala due to lunar eclipse effect: దేశ మంతట ఎక్కడ చూసిన కూడా చంద్ర గ్రహణం గురించే చర్చలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 7న రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే అన్ని ప్రధాన ఆలయాలు రేపు మూసి వేయనున్నారని ఆయా ఆలయ అధికారులు ప్రకటన చేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సైతం గ్రహణం ప్రభావం కారణంగా శ్రీవారి ఆలయాల్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 గంటల నుంచి, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3:00 గంటల వరకు ఆలయం మూసివేత కొనసాగుతుందని తెలిపారు. ఆలయం మూసివేత సందర్భంగా అన్ని రకాల ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫార్సు లేఖలపై జారీచేసే దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా.. గ్రహణం ముగిసిన తర్వాత, సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం నుంచి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి, దర్శనాలను యథావిధిగా పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
మరోవైపు చంద్ర గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు..
తిరుమల ఆలయంలో ప్రతినెల కూడా పౌర్ణమి రోజున గరువ సేవను నిర్వహిస్తారు. అయితే.. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం కారణంగా తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేయడం జరిగిందని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.