)
Big Shock To YS Jagan: ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరోసారి వైఎస్ జగన్కు చంద్రబాబు భారీ స్ట్రోక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలను ముగ్గురిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఒకే దెబ్బకు ముగ్గురిని చేర్చుకోవడంతో వైఎస్సార్సీపీకి భారీ దెబ్బ తగిలింది. కీలక పరిణామంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వీరి చేరికతో శాసనమండలిలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ పార్టీని వీడారు. అకస్మాత్తుగా పార్టీని వీడిన ఆ ముగ్గురు వెంటనే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నారు. అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆ ముగ్గురు ఎమ్మెల్సీలకు ఆహ్వానం పలికారు. తెలుగుదేశం పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ పరిణామంతో చంద్రబాబు మండలిలో బలం పెంచుకున్నారు.
తెలుగుదేశం పార్టీలోకి ముగ్గురు ఎమ్మెల్సీలు చేరడంతో వైఎస్సార్సీపీకి భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా.. శాసనమండలిలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. మండలిలో వైఎస్సార్సీపీని దెబ్బతీయాలని వ్యూహం రచించిన చంద్రబాబు ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు. వారిని పార్టీలోకి స్వాగతం పలికి వైఎస్ జగన్కు భారీ దెబ్బ తీశారు.
టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నాని, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, అనురాధ, చిరంజీవి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీటీ నాయుడు, రామ్గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook