
GST Price Cut Festival: జీఎస్టీ ధరల తగ్గుదలతో పండుగ చేసుకోవాలని ప్రజలకు చంద్రబాబు నాయుడు సూచించారు. సంస్కరణలతో ఆదా అయ్యే సొమ్ముతో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. తగ్గిన ధరలతో ఆనందంగా దసరా- దీపావళి పండుగలు చేసుకోవచ్చని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల లాభాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించారు. దసరా నుంచి దీపావళి వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేస్తామని.. 65 వేలకు పైగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
జీఎస్టీ సంస్కరణల ప్రచారంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు ఎలా మేలు జరిగిందో.. సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సూపర్ జీఎస్టీగా మార్చిందని.. దీని ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని వివరించారు. సుమారు రూ.8 వేల కోట్లు రాష్ట్ర ప్రజలకు ఆదా అవుతుందని ప్రకటించారు.
జీఎస్టీ 2.0 ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందేలా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశామని. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు తెచ్చారని చంద్రబాబు వివరించారు. 2047 నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాల సాధనకు జీఎస్టీ సంస్కరణలు, సూపర్ సిక్స్ , పీ4 కార్యక్రమాలు శక్తివంతంగా పని చేస్తాయని ప్రకటించారు. నిత్యావసర వస్తువుల్లో 99 శాతం వస్తువులపై సున్నా శాతం పన్ను ఉందని.. చిన్న చిన్న వ్యాపారాలకు లబ్ది కలుగుతుందని తెలిపారు.
ఎంఎస్ఎంఈలకు పెద్ద ఎత్తున జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు చెప్పారు. స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా నినాదాలకు ప్రత్యక్షంగా నెక్స్ జెన్ జీఎస్టీ సంస్కరణలు పెద్ద ఎత్తున తోడ్పడతాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు పెద్ద ఎత్తున సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దసరా నుంచి దీపావళి వరకూ జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రతి ఇంటికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. 65 వేలకు పైగా సమావేశాలు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వివరించారు.
సంస్కరణలతో అభివృద్ధి, సంపద సృష్టి జరిగే అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. నిత్యావసర సరకులు, గృహోపకరణాలు, ఔషధాలు, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు, మహిళలు, చిన్నారులు, రవాణా, హోటల్లు ఇలా వేర్వేరు రంగాల్లో పన్నులు తగ్గుతాయని వెల్లడించారు. వ్యవసాయ ఉపకరణాల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. సోమవారం నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు 26 జిల్లాల్లో జీఎస్టీ సంస్కరణలపై ప్రచారం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook