)
YSRCP: దళితులంటే చంద్రబాబుకి ఇప్పటికీ చిన్నచూపేనని, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినా దళితులపై ఆయన ఆలోచనల్లో మార్పు రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని అమరావతిలో దళితులకు ఇళ్ల పట్టాలిచ్చి గౌరవిస్తే.. చంద్రబాబు వాటిని ఊడపీకారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య ద్వారా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావాలని తపించే తండ్రీకొడుకులు వైఎస్సార్, వైఎస్ జగన్ అని తెలిపారు. చదువుల విప్లవాన్ని వారిద్దరూ సృష్టిస్తే.. చంద్రబాబు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువాకు వైఎస్సార్సీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, కనకారావు, వెలంపల్లి శ్రీనివాస్, మనోహర్రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ప్రసంగిస్తూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు కేటాయించకుండా వేధిస్తున్నాడని, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులను ఆధునీకరిస్తే పెండింగ్ పనులను చంద్రబాబు మూలన పడేశాడని ఆరోపించారు. మెడిసిన్ చదివి డాక్టర్ కావాలన్న బీసీ పేద విద్యార్థుల కలను చిదిమేసేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడని చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవి గుర్రం జాషువా మాదిరిగానే దివంగత వైఎస్సాఆర్ కూడా ఆలోచించి చదవుల ద్వారా సమాజంలో వెనుకబాటుతనాన్ని పారదోలవచ్చని నమ్మారని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. పేద, వెనుకబడిన వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఉన్నత చదువులు చదివించారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా రాజకీయాలు చేయకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసి దళితులకు వెన్నుదన్నుగా నిలిచారని వైఎస్సార్సీపీ నాయకులు కొనియాడారు.
చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారని.. రెడ్బుక్ పేరుతో వెనుకబడిన వర్గాల మీద దాడులకు తెగబడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీకొడుకులు వైఎస్సార్, వైఎస్ జగన్ తీసుకొచ్చిన చదువుల విప్లవాన్ని చంద్రబాబు నాశనం చేశాడని మండిపడ్డారు. పేదల కోసం వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి చంద్రబాబు పేద విద్యార్థుల ఆశలను చిదిమేశారని తెలిపారు. ప్రశ్నించే గొంతులను పోలీసులను ఉపయోగించి అక్రమ కేసులు బనాయించి అణచివేస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, పోర్టులు, రోడ్లు, ఆలయ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని నిర్బంధాలకు గురిచేసినా వేధించినా వైఎస్ జగన్ నాయకత్వంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook