Chandrababu naidu: బనకచర్ల ప్రాజెక్ట్ రచ్చ.. రేవంత్ కు ఇచ్చిపడేసిన చంద్రబాబు నాయుడు.!. ఏమన్నారంటే..?

Chanrababu naidu on banakacharla project: చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్ట్ పై రాజకీయాలు మానుకొవాలని రెండు తెలుగు రాష్ట్రాల నేతలను హెచ్చరించారు. దీనిపై కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేయోద్దని సీరియస్ అయ్యారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 19, 2025, 06:31 PM IST
  • బనకచర్ల ప్రాజెక్ట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
  • రాజకీయాలు మానుకొవాలని చురకలు..
Chandrababu naidu: బనకచర్ల ప్రాజెక్ట్ రచ్చ.. రేవంత్ కు ఇచ్చిపడేసిన చంద్రబాబు నాయుడు.!. ఏమన్నారంటే..?

Chandrababu naidu comments on banakacharla project: తెలంగాణ, ఏపీ ల మధ్య ప్రస్తుతం బనక చర్ల ప్రాజెక్ట్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఏర్పడిందే.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై అని తెలిసిందే. ప్రస్తుతం బనక చర్ల ప్రాజెక్ట్ వివాదంతో మరల రెండు తెలుగు స్టేట్స్ మధ్య అగాథం ఏర్పడిందని చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. బనక చర్ల ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల కోసం కలిసి రావాలన్నారు. దీని కోసం ఎంతదూరమైన వెళ్తామన్నారు.

Add Zee News as a Preferred Source

ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లే విన్నా కూడా.. తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని వ్యాఖ్యలుచేశారు. అంతే కాకుండా.. ఒకవేళ తమకు అక్కడ కూడా న్యాయం జరక్కపోతే.. ప్రజల ముందు తెల్చుకుంటామన్నారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ..కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు.

ఏపీలో నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు తెలిపారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిలో నీరుపుష్కలంగా ఉందన్నారు. ఏపీ , తెలంగాణాలు వాడుకొవచ్చాన్నారు.  అదే విధంగా కృష్ణానదిలో కూడా కొంత నీరుఉందన్నారు.  అయితే.. సముద్రంలో కలిసిపోతున్న నీళ్లను వాడుకుంటే తప్పేంటని అన్నారు.

అనవసరంగా నీటిపై రాజకీయాలు చేయాలనుకొవడంలేదన్నారు. తెలంగాణలోను ప్రాజెక్ట్ లు కట్టాలి.. ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలన్నారు. కానీ ప్రాజెక్ట్ లపై రాజకీయాలు చేయడం మానుకొవాలని ఇరు రాష్ట్రాల నేతలకు చురకలు పెట్టారు.

Read more: YS Jagan Video: చంద్రబాబు ఉంగరం సెంటిమెంట్ ఫాలో అవుతున్న జగన్.!. రాజ్యాధికారం కోసమేనా..?.. నెట్టింట కొత్త చర్చ.. వీడియో వైరల్..

బనక చర్లతో ఎవరికి నష్టంలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో తాము.. ఎప్పుడు కూడా గొడవపడలేదన్నారు. ఎవరి నీటిని వారు వాడుకునే హక్కు ఉందన్నారు. నీటి వినియోగం కోసం అవసరమైతే చర్చించుకుందమని చంద్రబాబు, రేవంత్ కు బిగ్ ఆఫర్ సైతం ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News