Chandrababu Naidu: కలల ప్రాజెక్టు 'స్వర్ణాంధ్ర విజన్ - 2047' సాధనకు కుప్పం, పిఠాపురం ఎంపిక

Chandrababu Naidu Dream Project Swarnandhra Vision 2047: తన కలకల ప్రాజెక్టు 'స్వర్ణాంధ్ర విజన్-2047' సాధించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ సంకల్పం అమలు కోసం ప్రయోగాత్మకంగా పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గంతోపాటు తన నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 17, 2025, 07:31 PM IST
Chandrababu Naidu: కలల ప్రాజెక్టు 'స్వర్ణాంధ్ర విజన్ - 2047' సాధనకు కుప్పం, పిఠాపురం ఎంపిక

Swarnandhra Vision 2047: ప్రతి నియోజవర్గానికీ విజన్ డాక్యుమెంట్ రూపొందించి స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా అభివృద్ధి ప్రణాళికల అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రత్యేక అధికారిగా జిల్లా స్థాయి అధికారి నియమిస్తామని తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్ సిద్ధం చేసినట్లు.. త్వరలో మిగిలిన వాటికి రూపకల్పన చేస్తామని వెల్లడించారు. త్రిభాషా సూత్రంపై రాద్ధాంతం వద్దని చెప్పారు.

Add Zee News as a Preferred Source

Also Read: Electricity Charges Decrease: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని.. తదనుగుణంగా ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన లఘు చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించి ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వాటికి ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టుగా ముందు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు వెల్లడించారు.

Also Read: Minister Nara Lokesh: వైసీపీ సభ్యులు పారిపోతున్నారు.. మార్షల్స్‌ను పెట్టి సభకు తీసుకురండి: నారా లోకేష్‌

నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్‌ను సఫలీకృతం చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తున్నామని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మండల, మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్‌ను గ్రామ, వార్డు సచివాలయం యూనిట్‌గా తీసుకుని అమలయ్యేలా చూస్తామన్నారు. జిల్లా విజన్ డాక్యుమెంట్ రూపొందించి కలెక్టర్ల సదుస్సులో విడుదల చేస్తామని.. ప్రతి చివరి వ్యక్తిని కూడా విజన్‌లో భాగస్వామిని చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలాగా పరిశ్రమలు తరిమేయడం కాకుండా తీసుకురావడం నేర్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

'నాడు 2020 రూపొందించాం. వికసిత్ భారత్ 2047 విజన్ కింద 30 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం కాగా, తలసరి ఆదాయం 18 వేల డాలర్లు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించుకుని నిర్ధష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. 'రాయలసీమ రతనాల సీమగా మారుతోంది. సీమ హార్టికల్చర్ హబ్‌గా మారుతోంది. రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్రంగా మారుతుంది' అని తెలిపారు. పేదలను దత్తత తీసుకునే వారికి ప్రభుత్వం తరపున అవార్డులు, గుర్తింపు ఇచ్చి గౌరవిస్తామని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News