)
chandrababu naidu visits alluri sitarama raju district: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లగిశపల్లిలో ముఖ్యమంత్రి పర్యటించారు. అంతే కాకుండా.. లగిశపల్లిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ క్రమంలో మాట్లాడుతూ.. ఏజెన్సీ అంటే అద్భుతమైన ప్రదేశం అన్నారు. ఇక్కడ స్వచ్చమైన గాలి, నేచురల్ గా అన్ని మనకు దొరుకుతాయన్నారు. ముఖ్యంగా గిరిజన ఉత్పత్తులపై ప్రశంసలు కురిపించారు. వారికున్న నైపుణ్యం,సామర్థంను గొప్పగా అభివర్ణించారు. గిరిజన ప్రాంతాల్లో.. ఐటీడీఏలో ఐఏఎస్ లను నియమించి ప్రత్యేకంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
ఒక అరకు కాఫీ ఇవ్వమ్మా... అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, గిరిజనులు తయారు చేసిన అరకు కాఫీ ఆస్వాదించారు. అరకు కాఫీకి మరింత బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని అధికారులని ఆదేశించారు. #Arakucoffee… pic.twitter.com/KesPmrxKmc
— Venu Babu Alluri (@VenuBabuAlluri1) August 9, 2025
పర్యాటకం, ప్రాసెసింగ్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. డోలీ మోతలు లేకుండా గిరిజన గ్రామాల్ని డెవలప్ మెంట్ చేస్తున్నామన్నారు. గిరిజనుల్లో మరింతగా చైతన్యం తీసుకొచ్చి, వారి హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరకు లో కాఫీ ఉత్సత్తులు తయారు చేసే ఒక షాపులోకి వెళ్లారు. అక్కడ టెస్టీ కాఫీని ఆస్వాదించారు.
అంతేకాకుండా.. కాఫీ రుచిగా ఉందని ప్రశంసలు కురిపించారు. అరకు కాఫీకి మరింత బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని అధికారులని ఆదేశించారు.ఈ క్రమంలో చంద్రబాబు కాఫీని ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook