
Mark Shankar Health Update: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనొవిచ్ చదువుకుంటున్న స్కూళ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తో పాటు పలువురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో నిన్న రెండు,మూడు అంతస్తుల్లో ఈ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 15 మంది చిన్న పిల్లలతో పాటు ఇతర స్కూల్ సిబ్బంది 19 మందికి పైగా గాయపడ్డారు. అయితే.. స్కూల్ సిబ్బంది పిల్లలను కాపాడి దగ్గరలో గత హాస్పిటల్ జాయిన్ చేశారు. మార్క్ శంకర్ ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం పవన్ కొడుకు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని ఓ తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ గారు తక్షణమే సింగపూర్కి బయల్దేరారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కుమారుడికి జరిగిన ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. పవన్ కళ్యాణ్ ను ఫోన్ లో పరామర్శించారు. అంతేకాదు మెరుగైన చికిత్స కోసం అక్కడ హై కమిషనర్ తో మాట్లాడారు. మరోవైపు పవన్ కుమారుడికి జరిగిన ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఓదార్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎక్స్ వేదికగా తెలియజేసారు.
మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు, మద్దతు అందించేందుకు సింగపూర్ బయలుదేరారు చిరంజీవి దంపతులు. అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ కు ప్రత్యేక విమానంలో బయలు దేరారు. మార్క్ శంకర్కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం ఎప్పటికపుడు తెలియజేస్తామన్నారు.మరోపక్క విశాఖ జిల్లా పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ సింగపూర్ చేరుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe