Simhachalam Temple Tragedy: చందనోత్సవం సందర్భంగా ఏర్పాట్లలో చంద్రబాబు నాయుడు తీవ్ర నిర్లక్ష్యం చేశారని.. దాని ఫలితమే గోడ కూలడం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సింహాచలం ఘటనలో చంద్రబాబు దోషి అని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తోందని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ, గోశాలలో గోవులు, శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి, తిరుపతి తొక్కిసలాట అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
Also Read: Indus Waters Treaty: సింధు నది జలాల ఒప్పందం ఏమిటి? టాప్ 10 ముఖ్యాంశాలు ఇవే!
సింహాచలం వరాహా లక్ష్మీనరసింహా స్వామి ఆలయం చందనోత్సవం వేళ గోడ కూలి ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మృతిచెందిన కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వైకుంఠ ఏకాదశి రోజు ఇలాగే చేశారు. తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా?' అని ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ కూడా నిర్లక్ష్యం వహించారని.. కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు.
Also Read: CM Chandrababu: పది నెలల పాలనలో సీఎం చంద్రబాబు ఫెయిలయ్యారా? పాసయ్యారా?
'ఆరు రోజుల కిందట గోడ కట్టడం ఏమిటి? రెండు రోజులకే పూర్తి చేయడం ఏమిటి?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. చందనోత్సవంపై ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదని.. కొత్తగా కట్టిన గోడ పక్కనే క్యూలైన్ ఎందుకు పెట్టారని నిలదీశారు. రాజకీయాల కోసం తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేయడంతో తొక్కిసలాట జరిగి ఏడుగురు మరణించారని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఏ ప్రమాదం సంభవించినా అన్నింటిలోనూ చంద్రబాబు దోషి అని ప్రకటించారు.
'సింహాచలం ఘటనను మాపైకి నెట్టే ప్రయత్నం చేశారు. కానీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా కూడా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు' అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలని హితవు పలికారు. మృతుల కుటుంబాలకు భారీగా పరిహారం ఇవ్వాలని.. ఆ కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున ఆదుకుంటామని ప్రకటించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. తప్పకుండా ఆ బాధితులకు న్యాయం చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రభుత్వానికి తెలియదా?ఆరోజుల్లో లక్షల మంది ప్రజలు వస్తారని తెలిసి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు బలిగొన్నారు.
క్యూలో నిలబడ్డవాళ్లకు నీళ్లు లేవు. కనీసం టాయిలెట్స్లేవు.
ఆరురోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టి, రెండు రోజుల కిందట గోడ పూర్తి… pic.twitter.com/22UIdD1T8L— YSR Congress Party (@YSRCParty) April 30, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









