)
Chandrababu Gift To Employees: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కానుకలు ఇస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులను ఏమాత్రం జాప్యం చేయకుండా కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో 327 మందికి ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా పదోన్నతులను కలిపితే మొత్తం 600 మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది.
ఆగష్టు 31వ తేదీతో ముగిసిన 2024-25 ప్యానల్ సంవత్సరంలో ప్రభుత్వ వైద్యులకు వైద్యారోగ్య శాఖ భారీ స్థాయిలో ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వివిధ విభాగాల అధీనంలో పనిచేసే దాదాపు 600 మంది వైద్యులు పదోన్నతులు పొందడం విశేషం. ఏడాదికాలంగా పదోన్నతులు ఆలస్యమయ్యాయని ఫిర్యాదులు రావడంతో నిర్ణీత సమయంలో అర్హులైన వైద్యులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ స్థాయిలో పదోన్నతులు జరిగాయి.
వివిధ విభాగాలకు చెందిన ఆరుగురు సీనియర్ ప్రొఫెసర్లను ఏడీఎంఈలుగా (అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) ప్రమోట్ చేయాలని తాజాగా వచ్చిన కమిటీ సిఫారసులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధానాసుపత్రుల సూపరింటెండెంట్లుగా వారు ప్రమోషన్లు పొందనున్నారు. 2024-25 ప్యానల్ ఇయర్లో మొత్తం 13 మంది సీనియర్ వైద్యులు ఏడీఎంఈలుగా ప్రమోటయ్యారు.
సెంకడరీ వైద్య విభాగంలో..
ప్రభుత్వ సెంకడరీ ఆసుపత్రుల్లో వివిధ స్థాయిల్లో సేవలు అందిస్తున్న 321 మంది వైద్యులకు పదోన్నతులు కల్పించినట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. 34 మంది సివిల్ సర్జన్ స్పెషలిస్టులుగా, 78 మంది డెప్యుటీ సివిల్ సర్జన్ స్పెషలిస్టులుగా, 109 మంది డిప్యుటీ సివిల్ సర్జన్ జనరల్గా పదోన్నతి పొందారు. వీరితో పాటు 100 మంది డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు డిప్యూటీ డెంటల్ సర్జన్లుగా ప్రమోషన్ పొందారు.
డీఎంఈలో..
ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధానాసుపత్రుల్లో పనిచేసే 217 మంది వైద్యులకు 2024-25లో ప్రమోషన్లు కల్పించారు. వీరిలో 13 మంది వైద్యులు ఏడీఎంఈలుగా, 96 మంది ప్రొఫెసర్లుగా, మరో 108 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోటయ్యారు. 2024-25 ప్యానల్ సంవత్సరంలో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, ఆయుష్ వైద్య సేవలు అందిస్తున్న దాదాపు 600 మంది వైద్యులకు ఆయా విభాగాల్లో పదోన్నతులు కల్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.