)
AP DCCB Chairman Posts: ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలకు డీసీసీబీ చైర్మన్లను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్లను కూడా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ నియామక ఉత్వర్తులు జారీ చేసింది. డీసీసీబీ చైర్మన్ పోస్టులలో తొమ్మిది టీడీపీకి, ఒకటి జనసేనకు దక్కాయి. ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులకు చైర్మన్ పదవులు దక్కాయి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు నియమించగా.. తూ.గో, ప.గో, ప్రకాశం జిల్లాలకు ఇంకా నియమించలేదు.
ఏ జిల్లాకు ఎవరు అంటే..?
==> కర్నూలు డీసీసీబీ ఛైర్మన్గా డి.విష్ణువర్ధన్ రెడ్డి (TDP)
==> కడప డీసీసీబీ ఛైర్మన్గా బి.సూర్యనారాయణరెడ్ది (TDP)
==> అనంతపురం డీసీసీబీ ఛైర్మన్గా కేశవరెడ్డి (TDP)
==> చిత్తూరు డీసీసీబీ ఛైర్మన్గా అమాస రాజశేఖర్ రెడ్డి (TDP)
==> నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్గా ధనుంజయరెడ్డి (TDP)
==> గుంటూరు డీసీసీబీ ఛైర్మన్గా మాకినేని మల్లికార్జునరావు (TDP)
==> కృష్ణా డీసీసీబీ ఛైర్మన్గా నెట్టెం రఘురామ్ (TDP)
==> విశాఖ డీసీసీబీ ఛైర్మన్గా కోన తాతారావు (జనసేన)
==> విజయనగరం డీసీసీబీ ఛైర్మన్గా కిమిడి నాగార్జున (TDP)
==> శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్ గా శివ్వల సూర్యనారాయణ (TDP)
ప్రస్తుతం బీజేపీకి కేటాయించలేదు. ఇంకా జిల్లాలు పెడింగ్లో ఉండడంతో అందులో ఒకటి బీజేపీకి కేటాయిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగినా.. ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే డీసీసీబీ ఛైర్మన్ల నియాకమం జరుగుతోంది. DCCB, DCMS లకు జాయింట్ కలెక్టర్లు అధికారిక పర్సన్ ఇంఛార్జ్లుగా ఉన్నారు.