)
Andhra Pradesh Fake News: రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం చేస్తోందని.. ఫేక్ ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారని వైఎస్సార్సీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల రవాణాను అడ్డుకుంటూ వైసీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ఎరువుల రవాణాను అడ్డుకుంటూ వైసీపీ డ్రామాలాడుతోందని.. వారి దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందొద్దు.. వారి రాజకీయ ఉచ్చులో పడొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని.. ఇంకా వస్తున్నాయని ప్రకటించారు.
ఎరువుల లభ్యత.. సరఫరాపై అమరావతిలోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎరువుల సరఫరా లెక్కలను వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తున్న వారికి ఈ సందర్భంగా చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
'అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారం చేస్తోంది. విషవృక్షం లాంటి వైఎస్సార్సీపీ చేసే దుష్ప్రచారాల్లో భాగంగా మరో ఫేక్ స్టోరీని ప్రచారం చేస్తోంది. యూరియా, ఎరువుల కొరత ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు' అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ, విషపు విత్తనాలను చల్లుతోందని ఆరోపించారు.
'రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు ఎరువులను సిద్దం చేస్తాం. వచ్చే రబీ నాటికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేటాయింపులు చేసుకుంటున్నాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాల్లో అన్ని రిటైల్ షాపుల్లో, ప్రస్తుత నిల్వలు, సరఫరాపై సమీక్ష చేసుకుని అవసరమైన చోటకు ఎరువులు తరలించాలని కలెక్టర్లకు చెప్పినట్లు వెల్లడించారు. డిమాండ్ ఉన్న జిల్లాలకు మార్క్ ఫెడ్ ద్వారా ఎరువులు తరలించి రైతులకు సరఫరా చేస్తామని ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టి ఎరువులు పక్కదారి పట్టకుండా చూడమని చెప్పినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. డ్రామాలు అడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. దుష్ప్రచారం చేసే వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఫేక్ రాజకీయాలు చేసినా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. 'పేటీఎం బ్యాచ్ తప్పుడు పోస్టులు చేసి ఆందోళన కలిగించి.. రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే తాట తీస్తాం. దురుద్దేశంగా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతాం. మొన్నటి వరకు మహిళలపై, నిన్న రాజధానిపై, ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు. ఇలాంటి వాటిని కచ్చితంగా నియంత్రిస్తాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.