)
Collectors Transfers in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే జిల్లా కలెక్టర్ల బదిలీలు భారీగా జరిగాయి. దాదాపుగా 12 జిల్లాల కలెక్టర్ల బదిలీకి సంబంధించిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. ఈ బదిలీల్లో ఓ అరుదైన సంఘటన జరిగింది. బహుశా ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఇదొ అరుదైన సంఘటన కావొచ్చు. ఇంతకు ముందు ఇలాంటి జరగలేదేమో? కానీ, ఇప్పుడు జరిగింది. అదేంటంటే? ఒకేరోజు ఇద్దరు భార్యభర్తలు కలెక్టర్లుగా నియామకం అయ్యారు.
నెల్లూరు జిల్లాకు ఇటీవలే జరిగిన బదిలీల్లో కలెక్టర్గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టారు. అదే రోజున ఆయన భార్య అయిన కృతికా శుక్లా కూడా పల్నాడు జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఒకేరోజు ఇద్దరు కలెక్టర్లుగా బాధ్యత స్వీకరించడం పట్ల వారి కుటుంబసభ్యులతో పాటు సన్నిహితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2013 బ్యాచ్కు చెందిన హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా..ఈ భార్యభర్తలలో ఒకరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారైతే.. మరొకరు హర్యానా రాష్ట్రానికి చెందిన వారు.
వీరిద్దరూ ఇప్పటివరకు జాయింట్ కలెక్టర్లుగా, కలెక్టర్లుగా, హెచ్ఓడీ బాధ్యతలతో పాటు ఇతర శాఖలకు అధిపతిగా పనిచేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలకు పాలనాధికారులుగా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వీరిద్దరికి ఒకేసారి కలెక్టర్లుగా పనిచేసే అవకాశం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన బదిలీల్లో 12 జిల్లాలకు వచ్చిన కొత్త కలెక్టర్లు వీరే..
1. పార్వతీపురం మన్యం జిల్లా – ప్రభాకర్ రెడ్డి
2. విజయనగరం జిల్లా – రామసుందర్ రెడ్డి
3. తూర్పు గోదావరి జిల్లా – కీర్తి చేకూరి
4. గుంటూరు జిల్లా – తమీమ్ అన్సారియా
5. పల్నాడు జిల్లా – కృతిక శుక్లా
6. బాపట్ల జిల్లా – వినోద్ కుమార్
7. ప్రకాశం జిల్లా – రాజా బాబు
8. నెల్లూరు జిల్లా – హిమాన్షు శుక్లా
9. అన్నమయ్య జిల్లా – నిషాంత్ కుమార్
10. కర్నూలు జిల్లా – డాక్టర్ ఎ సిరి
11. అనంతపురం జిల్లా – ఓ.ఆనంద్.
12. సత్య సాయి జిల్లా – శ్యాంప్రసాద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook