)
Customer attacked with knife by hotel staff in Vijayawada: ఇటీవల కాలంలో జనాలు ప్రతి చిన్న విషయాల్ని కూడా పెద్దది చేసుకుంటున్నారు. ప్రతిదానికి వాదులాడు కోవడం, గోడవలు చేయ్యడం వంటివి చేస్తున్నారు. కొంత మంది అయితే ఆవేశంలో నోటికొచ్చినట్లు తిట్టడం, చంపేందుకు కూడా వెనుకాడటలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విజయవాడ లోని వైఎస్సార్ కాలనీ సర్కిల్లోని వెల్కమ్ హోటల్లో ఈ ఘటనచోటు చేసుకుంది. శనివారం రాత్రి వెల్కమ్ హోటల్కు టిఫిన్ కోసం అబ్దుల్ కరీం అనే కస్టమర్ వెళ్లాడు. అతను ఉప్మా దోశ పార్సిల్ కావాలని ఆర్డర్ చేశాడు. వారు ఆర్డర్ ఇచ్చాడు. బిల్ పే చేసి ఇంటికి వెళ్లాడు.
అక్కడ చూడగా.. అది ప్లెయిన్ దోశ ఉంది. మరల హోటల్ కువచ్చి ప్లెయిన్ దోశ ఇచ్చారని ప్రశ్నించాడు. దీంతో హోటల్ సిబ్బంది సీరియస్ అయ్యారు. వీరి మధ్య మాటామాట పెరగింది. అది గొడవకు దారితీసింది. సహనం కోల్పోయిన హోటల్ సిబ్బంది అబ్దుల్ కరీంపై కత్తితో దాడి చేశారు. మెడ భాగంలో కత్తితో దాడులు చేశారు.
తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడి వాళ్లు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు . వైద్యులు చికిత్స చేసి అతనికి కుట్లు వేశారు. దీంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది.ఈ ఘటనపై బాధితుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంత చిన్న విషయానికి కత్తిపోట్లు ఏంటని అందరు షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook