)
Pawan kalyan Teleconference with kakinada officials on montha cyclone: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం‘మొంథా’ ఎఫెక్ట్ కన్పిస్తుంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వానల నేపథ్యంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ సైతం.. కాకినాడ జిల్లా ఉన్నతాధికారులతో టెలికాన్పరెన్స్ సమావేశంలో మాట్లాడారు. జిల్లా యంత్రాంగం ఎల్లవేళల అప్రమత్తంగా ఉండాలని, అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా ‘మొంథా’ తుపాను ప్రభావం ముఖ్యంగా తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తాళ్ళరేవు మండలాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయంనుగుర్తు చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లకూడదన్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఆహారం, మంచినీరు, మందులు, పాలు వంటి నిత్యావసరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, నీటిపారుదల, అగ్నిమాపక శాఖలతో పాటు విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉప్పాడ వద్ద సముద్ర కోతకు గురయ్యే ప్రాంతంలోఅప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏలేరు రిజర్వాయర్ నీటిమట్టంపై ఆరా తీయగా, రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో ఉందని, గేట్లు ఎత్తే ముందు ఆయకట్టు రైతులను, ప్రజలను అలర్ట్ చేస్తామని కలెక్టర్ మోహన్ వెల్లడించారు.
మరోవైపు..‘మొంథా’ తుపాను ఎఫెక్ట్ తో.. కాకినాడకు వెళ్లేందుకు పవన్ సిద్దమయ్యారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారని, పర్యటనను వాయిదా వేసుకొవాలని జిల్లాకలెక్టర్ కోరడంతో.. పవన్ తన సానుకూలంగా స్పందించిన తన ప్రయాణంను వాయిదా వేసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి