deputy cm pawan kalyan tweet on cow protection: తిరుమల లడ్డు వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాన్ సనాతన ధర్మం అంటూ రెచ్చిపోయారు. హిందు ధర్మంను కాపాడటం కోసం తనప్రాణాల్ని సైతం అర్పించడానికి సిద్దంగా ఉన్నానంటూ తెల్చి చెప్పారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇటీవల హిందు మతంకు బ్రాండ్ అంబాసిడర్ గా మాట్లాడుతున్నారని, ఎన్నికలకు ముందు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోల మాట్లాడుతున్నారని ఆయను కొంత మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల బక్రీద్ నేపథ్యంలో ఆయన చేసిన ట్విట్ పెద్ద దుమారంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవల ట్విట్ చేస్తు గోవుల్ని సంరక్షించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు . గోవులను పవిత్రంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మన సమాజంలో ఉందని, అటువంటి గోమాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. గోవుల్ని హింసించే వారిపై చర్యలు తీసుకొవాడానికి చట్టాలు ఉన్నాయన్నారు. ఈ ట్విట్ ప్రస్తుతం పెనుదుమారంగా మారింది.
బక్రీద్ నేపథ్యంలో ముస్లింలు ఆవుల్ని తరలిస్తుంటారు. ముఖ్యంగా కభేళాలకు రహాస్యంగా ఆవుల్ని లారీల్లో కుక్కి వాటిని వధిస్తుంటారు. బక్రీద్ రోజు చాలా మంది గోమాంసం తింటారని కూడా చెబుతుంటారు. అయితే.. పవన్ కళ్యాన్ బక్రీద్ పండగ నేపథ్యంలో చేసిన ట్విట్ ను ఒక వర్గం వారు..తమపై పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని కూడా సోషల్ మీడియాలో వేదికగా మండిపడుతున్నారు.
బాధ్యతల గల ప్రభుత్వంలో ఉండి.. ఒక మతాం వారి మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి వ్యాఖ్యలు పండగ పూట చేయడం సరికాదని కూడా వారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కామెంట్స్ లకు గోసంరక్షక ప్రతినిధులు, జనసేన అభిమానులు కౌంటర్ లు కూడా ఇస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









