Duvvada Srinivas: డేటింగ్‌తో దువ్వాడ శ్రీనివాస్‌ రాజకీయ సమాధి.. ఇక దివ్వెల మాధురితో ఎన్ని వేషాలైనా వేయొచ్చు

MLC Duvvada Srinivas Suspend From YSRCP: మొదటి భార్య కుటుంబాన్ని వదిలేయడం అనంతరం ఓ మహిళతో కలిసి సహజీవనం.. చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఆ రాజకీయ నాయకుడి పదవీకే ఎసరుపెట్టింది. మొత్తానికి అతడిని వైఎస్సార్‌సీపీ పదవి నుంచి సస్పెండ్‌ చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 23, 2025, 12:05 AM IST
Duvvada Srinivas: డేటింగ్‌తో దువ్వాడ శ్రీనివాస్‌ రాజకీయ సమాధి.. ఇక దివ్వెల మాధురితో ఎన్ని వేషాలైనా వేయొచ్చు

YSRCP Suspend: వివాదాలకు.. సంచనాలకు కేంద్రంగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఎట్టకేలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యాడు. అతడి రాజకీయ జీవితం.. వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా.. సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన దువ్వాడ రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పడినట్టు అయ్యింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంచలన ప్రకటన చేసింది.

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు దువ్వాడ శ్రీనివాస్‌ పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసులతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అతడి సస్పెన్షన్‌ ఉత్తర్వులను విడుదల చేసింది. ఇకపై అతడితో వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం లేదని ఆ పార్టీ ప్రకటించింది. వ్యక్తిగత జీవితంతో పార్టీకి చేటు చేస్తుండడంతో అతడిని వైఎస్సార్‌సీపీ బయటకు పంపించి వేసింది.

పలు నియామకాలు
అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్‌నాథ్‌ను నియమించగా.. విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా కేకే రాజుని వైఎస్సార్‌‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నియమించారు. 

ఊరూపేరు లేని సంస్థలకు కారుచౌకగా
ఐటీకి విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దుతామని భూకేటాయింపులు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ఐటీ శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశార. 'విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలోని విలువైన భూములను ఊరూపేరు లేని సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతోంది. షెల్ కంపెనీల సృష్టికర్త చంద్రబాబు ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పద్ధతి నాకు ఎప్పటి నుంచో అలవాటు అని చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు' అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. 'రూ.వెయ్యి కోట్ల భూమి ఇచ్చి రూ.వంద కోట్ల పెట్టుబడులు పెట్టమంటూ ఎవరైనా చేయగలరు. దీనికోసం ఎక్కడ నుంచో లులు వంటి కంపెనీలను పిలవక్కర్లేదు. విశాఖను ఆర్థిక రాజధానిగా కాక చంద్రబాబు అవినీతికి రాజధానిగా మారుస్తున్నారు' అని అమర్‌నాథ్ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News