
YSR Congress Party: హఠాత్తుగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి తీవ్ర సంచలనం రేపగా.. తాజాగా కొన్ని విషయాలు ప్రకటించి కలకలం రేపారు. వైసీపీకి రాజీనామా చేయడానికి గల కారణాలను విజయసాయి రెడ్డి వివరించారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని.. దానివల్లే తాను వైఎస్ జగన్కు దూరమయ్యానని సంచన విషయం తెలిపారు. జగన్ మనసులో తనకు స్థానం లేదని తెలియడంతో ఆ విషయం తెలిసి మనసు విరిగి రాజీనామా చేసినట్లు వివరించారు.
ఏపీ సీఐడీ విచారణ అనంతరం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. 'ఈ కారణాల వలన వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్కు చెప్పా' అని తెలిపారు. 'కోటరీ నుంచి జగన్ బయటపడాలి. అప్పుడే జగన్కు భవిష్యత్ ఉంటుంది. కొందరు నేతలు జగన్ చుట్టూ కోటరీగా ఏర్పడ్డారు' అని పేర్కొన్నారు. జగన్ను ఎవరికైనా పరిచయం చేయాలంటే ఈ కోటరీ కి లాభం చేకూర్చాల్సి ఉంటుందని సంచలన విషయాన్ని బయటపెట్టారు.
'నాయకుడు ఈ చెప్పుడు మాటలు నమ్మకూడదు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, పార్టీ, ప్రజలు నష్టపోతారు' అని విజయసాయి రెడ్డి తెలిపారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్రధారి అని చెప్పారు. తనకు భయం అంటే తెలీదన్నారు. 'వైఎస్సార్సీపీలో నేను అనేక అవమానాలు, కష్టాలు పడ్డాను. నాకు అనేక పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేక వెళ్లిపోయాను. నేను ప్రలోభాలకు లొంగాను.. భయపడ్డాను అని ఆరోపించారు. కానీ అవేం జరగలేదు' అని వెల్లడించారు. 'మా నాయకుడిలోనే (జగన్) మార్పు వచ్చింది. ఒకప్పుడు మా నాయకుడు అంటే భక్తి ఉండేది. ఇప్పుడు అది దేవుడి మీదకు వెళ్లింది' అని విజయసాయి రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe