)
Passenger brutally attacks on apsrtc bus driver in Vijayawada: రెండు తెలుగు రాష్ట్రాలు సైతం ఉచిత బస్సు ప్రయాణంను అమలు చేస్తున్నాయి. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తుంటే ప్రభుత్వం అనుకున్న దానికంటే.. పూర్తిగా భిన్నంగా మారిందని చెప్పుకొవచ్చు. ఉచిత బస్సు జర్నీతో మహిళలకు కొంత ఆసరాగా ఉండవచ్చని ప్రభుత్వాలు భావించాయి.
కానీ చాలా చోట్ల మహిళలు సీట్ల కోసం గోడవలు పడటం, కొట్టుకోవడం, అవసరంలేకున్న ప్రయాణాలు చేయడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది మహిళలు తమకు ఉచిత బస్సు అవసరంలేదని కూడా చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహిళలు ఒకరిపై మరోకరు దాడులు చేసుకోవడం, కొన్ని చోట్ల డ్రైవర్, కండక్టర్ లతో వాగ్వాదంకు దిగడం వంటివి చేస్తున్నారు. ఈ ఘటనలు వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా.. విజయ వాడలో ఒక ప్రయాణికులు బస్సు డ్రైవర్ మీద పిడిగుద్దులు కురిపించడం ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఈ వీడియో సైతం నెట్టింట వైరల్గా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో విజయ వాడకు చెందిన బస్సు డ్రైవర్ మీద ప్రయాణికుడు ఇష్టమున్నట్లుదాడులు చేశారు. పిడిగుద్దులు కురిపించుకుంటూ రెచ్చిపోయాడు. అక్కడ ఉన్న వారు ఆపాలని చూస్తున్న ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. బూతులు తిడుతూ, దాడులకు దిగాడు.
ఈ క్రమంలో ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు, ఆర్టీసీ అధికారులు కూడా సీరియస్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని ఆర్టీసీని, పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.