)
Employees Health Scheme: ఉద్యోగులు, పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, వారి కుటుంబసభ్యుల ప్రయోజనం కోసం అమలవుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)పై కీలక ప్రకటన చేసింది. ఈహెచ్ఎస్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, లోపాలను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించడానికి ప్రభుత్వం కొత్త కమిటీని నియమించింది. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతనెలలో ఉద్యోగ సంఘాలకు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో ఈ మేరకు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కమిటీని నియమించారు. ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి కొన్ని సమస్యలను ఉద్యోగ సంఘాల నాయకులు గతనెలలో మంత్రుల కమిటీ, ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఉద్యోగులు లేవనెత్తిన అంశాల పరిష్కారం దిశగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు కమిటీని నియమించారు.
కమిటీ ఇదే!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీలో జీఏడీ విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ ముఖ్య కార్యదర్శి, వ్యయ విభాగం కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఉద్యోగ సంఘాల ఇద్దరు ప్రతినిధులు కమిటీలో ఉంటారు. నియమించిన ఈ కమిటీ 8 వారాల్లో ఈహెచ్ఎస్ పటిష్ట అమలుపై నివేదిక సమర్పించనుంది.
ఈహెచ్ఎస్లో వీరే..
2013లో ఉమ్మడి ఏపీలో ప్రారంభమైన ఈహెచ్ఎస్ పథకంలో మొత్తం 23, 58,858 లబ్దిదారులు
5,53,182 మంది ఉద్యోగులు
2,29,964 మంది పింఛనుదారులు
81,748 మంది కుటుంబ పింఛనుదారులతో పాటు వారి కుటుంబసభ్యులు
ఈహెచ్ఎస్ పథకానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం, లబ్దిదారులు చెరి సగం భరిస్తారు. సాలీనా దాదాపు రూ.350 కోట్ల మేర ఖర్చవుతోంది.
ఉద్యోగుల డిమాండ్లు ఇవే..
==> వైద్య సేవల కోసం చేసిన ఖర్చును సకాలంలో చెల్లించాలి
==> వివిధ వ్యాధుల ప్యాకేజీ ధరలను పెంచాలి.
==> ఈహెచ్ఎస్ కింద సేవలందించడానికి ఆసుపత్రుల నిరాసక్తత
==> ఈహెచ్ఎస్ పర్యవేక్షణ లోపం, ఫిర్యాదుల పరిష్కారం జరగాలి
==> ఈహెచ్ఎస్ అమలుకోసం వినియోగిస్తున్న ఆన్లైన్ పోర్టల్ పరిమిత సామర్ధ్యం పెంచాలి
==> ఈహెచ్ఎస్ పథకం అమలులో లబ్దిదారుల అనుభవాలు, సమస్యలు, లోపాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. వాటి పరిష్కార మార్గాలపై 8 వారాల్లో నివేదిక సమర్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook