Tirumala News: హనుమాన్ జయంతి వేళ తిరుమలలో మహా అపచారం.. ఏకంగా గర్భగుడి వద్దకు.. వీడియో వైరల్..

Tirumala temple: తిరుమలలో టీటీడీ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా ఇంకా కొంత మంది వివాదాస్పదంగా ప్రవర్తిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా.. కొంత మంది భక్తులు ప్రవర్తించిన తీరుపై తోటి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 12, 2025, 02:05 PM IST
  • తిరుమలలో మళ్లీ అపచారం..
  • ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న భక్తులు..
Tirumala News: హనుమాన్ జయంతి వేళ తిరుమలలో మహా అపచారం.. ఏకంగా గర్భగుడి వద్దకు.. వీడియో వైరల్..

Devotees wear chappals near Tirumala main temple video: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని చాలా మంది కొంగు బంగారంలో భావిస్తారు. పిలిస్తే పలికి దైవంగా  చెప్తుంటారు. ఎన్ని కష్టాలు ఉన్నా.. ఆయన పేరు తల్చుకుంటే గట్టేక్కిస్తాడని చాలా మంది భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి ఏడుకొండల స్వామి ఆలయం నేడు తరచుగా ఏదో ఒక వివాదాలలో ఉంటుంది.

Add Zee News as a Preferred Source

తిరుమలలో కొంత మంది రాజకీయాలు మాట్లాడున్నారు. మరికొందరు రీల్స్ తీసుకుంటున్నారు. పవిత్రమైన ప్రదేశంలో మద్యం, మాంసం, అన్యమత ప్రచారం వంటి పాడుపనులు చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ఇప్పటికి అధికారుల కళ్లు కప్పి కొంత మంది నీచంగా ప్రవర్తిస్తున్నారు.

 

అయితే.. కూటమి సర్కారు తిరుమలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఒక వైపు సాధారణ భక్తులే ప్రయారిటీగా చర్యలు తీసుకొవాలని టీటీడీని ఆదేశించింది. మరోవైపు శ్రీవారికి చేసే కైంకర్యాలలో ఎలాంటి లోటు పాట్లు ఉండొద్దని కూడా ఆదేశించారు. ఈ క్రమంలో టీటీడీ ఎన్ని పకట్బంది చర్యలు తీసుకున్న కూడా ఇంకా కొంత మంది భక్తులు అధికారుల కళ్లు కప్పి.. అపచారాలకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా.. మరో చోటు చేసుకున్న ఒక ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే.. తాజాగా.. కొంత మంది భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని తిరుమల శ్రీవారి ముఖ మండపం దాక వచ్చేశారు. దీంతో అక్కడున్న సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు . నిజానికి.. తిరుమల శ్రీవారి దర్శనం నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. కానీ ఆ మూడు స్థానాల్లో కూడా టిటిడి అధికారులు చెప్పుల ఘటనను గుర్తించలేదు.

మరీ ఈ విషయంలో భద్రత సిబ్బంది నెగ్లీజెన్సీగా ఉన్నారా..?.. లేదా  భక్తులే ఏదైన చేశారా అన్నదానిపై ప్రస్తుతం టీటీడీ అధికారుల విచారణ చేపట్టారు. మొత్తంగా కొంతమంది భక్తులు చెప్పులు వేసుకుని రావడంపై తోటి భక్తులు కూడా ఆగ్రహాం వ్యక్తం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.

Read more: Hanuman Jayanti: ఆంజనేయుడికి సింధూరం, వడమాల అంటే ఎందుకంత ఇష్టం..?.. ఈ పురాణగాథ మీకు తెలుసా..?

 

ఇదిలా ఉండగా.. తిరుమలలో ముఖ్యంగా సమ్మర్ లో వచ్చే భక్తులుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. మొత్తంగా అధికారులు చలువ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటి వసతి, అన్నప్రసాదాలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఇటీవల తెలంగాన పొలిటియన్స్ సిఫారసుల కోసం టీటీడీ ప్రత్యేకంగా యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇన్నాళ్లు కొనసాగిన వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్లైంది. ప్రస్తుతం సాఫీగా దర్శనాలు అవుతున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News