)
Weather Live Updates In Telangana Andhra Pradesh : వాయవ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడునుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలోని తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా వుంటుందని వివరించింది. ఈ మేరకు ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటోంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే నేడు రేపు మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు రంగా రెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో వానలు పడతాయంటూ వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల మూలంగా మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే గణేష్ నవరాత్రులు మూలంగా ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగే అవకాశాలున్నాయి. దీంతో హైదరాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్ మెంట్ తో పాటు జీహెచ్ఎంసీ వాళ్లను అలర్ట్ చేశారు. మొత్తంగా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలతో పాటు అక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ గా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.