)
Rocks fall on bike rider in tirumala ghat road: తిరుమలలో భారీగా వర్షం కురుస్తుంది. దీంతో భక్తులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొడుగులు పట్టుకుని భక్తులు దర్శనాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలో రద్దీ మధ్యస్థంగా ఉంది. మరోవైపు భారీ వర్షంతో తిరుమల భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెట్లమార్గంలో వెళ్తున్న భక్తులు చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఘాట్ మార్గంలో వెళ్తున ఒక బైకర్ మీద కొండ నుంచి భారీ బండారాయి వచ్చి అతని మీద పడింది.
మంగళవారం రోజున కొండ పైకి వెళుతున్న ఒక బైకర్ పై రాయి పడింది. రెండో ఘాట్ రోడ్డులో హరిణి ప్రాంతం దగ్గర బైకర్ ప్రమాదానికి గురయ్యాడు. వర్షం కారణంగా కొండ పైనుంచి ఒక రాయి దొర్లుకుంటూ వచ్చి మీద పడింది. దీంతో లోకేశ్ బైక్ అదుపు తప్పి పైనుంచి కిందపడ్డాడు. అతడి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.
వాహనదారులు అంబులెన్స్ కు ఫోన్ చేసి లోకేశ్ ను ఆసుపత్రికి తరలించారు. లోకేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని స్విమ్స్ వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా కాలి నడక , బైకర్ లు కొండపైకి ఘాట్ మార్గంలో వచ్చే భక్తులు జాగ్రత్తాలు పాటించాలని టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. పది రోజుల పాటు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి