)
Andhra Pradesh Heavy Rains: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండంగా తీరం వైపు దూసుకు వస్తోంది. ఇది 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు (శుక్రవారం) మోస్తరు వర్షం కురుస్తుందని, ఎల్లుండి (శనివారం) రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఇక తీరం వెంట గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటోంది. సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని, మత్య్స కారులు చేపల వేటకు ఎవరూ వెళ్ళవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ సారి వాయుగుండం ఎఫెక్ట్ కోస్తాంధ్ర ప్రాంతానికే కాకుండా రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
అటు సెన్యార్ తుపాను ఎఫెక్ట్ ప్రభావంతో తెలంగాణలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు హైదరాబాద్ లో ఓ మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ఏపీలో విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే తుపాను ప్రభావంతో వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అంతేకాదు అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం, కొత్త బట్టలు, ఔషధాలను అందుబాటులో ఉంచారు. అత్యవసరం అయితే.. 108 కానీ 100కానీ డయల్ చేయమని చెప్పారు. ఈ నెంబర్లు కు ఫోన్ చేస్తే ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులకు వీళ్లు సమాచారం చేరవేస్తారు. లేకపోతే ప్రజలకు అక్కడ లోకల్ గా ఉండే అధికారుల ఫోన్ నెంబర్స్ ఇవ్వనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.