)
Andhra Pradesh Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైన మూలానా మొంథా తుపాను ఏర్పడింది. దీని ఎఫెక్ట్ తో ఏపీలో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నష్టం చేకూరింది. పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. మరోవైపు ప్రజలు కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఏపీలో 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా బంగాళాఖాతంలో వాయు గుండం ఏర్పడింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఈ రోజు రేపు పిడుగులతో కూడిన వానలు పడతాయంటోంది. ఈమేరకు 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటోంది.
ఈ రోజు కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వానలు పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని ప్రజలు హెచ్చరించింది వాతావరణశాఖ. ఇక ఆంధ్ర ప్రదేశ్ కురుస్తోన్న వర్షాలతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు పండించిన పంట నేల పాలైంది. మరోవైపు కోతకు వచ్చిన పంట చేతికి అందకుండా పోయింది. ప్రభుత్వం కూడా పంట నష్టం అంచనా వేస్తోంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.