)
Heavy Rains in Telangana Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కాస్త తెరపి ఇచ్చిన వానలు.. ఏపీలో మాత్రం కుమ్మేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక రాజధాని తిరుపతితో పాటు తిరుమల భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని..దీని ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భాగ్యనగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.అటు ఏపీలో ఇవాళ అతిభారీ వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
ఈ మేరకు కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కుండపోత వానలకు తోడు పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నిన్న ఉత్తరాంద్ర, ఉభయగోదావరి జిల్లాలు, కర్నూలు జిల్లాల్లో వానలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.