)
Summer Waves: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. వడగాలులు వీస్తున్నాయి. ఈ వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఇవాళ కోస్తా ప్రాంతంలో 45 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. 185 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఇక రేపు అంటే సోమవారం 34 మండలాల్లో తీవ్రంగా, 171 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు ఉంటాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు. అవసరమైతే బయటకు రావాలని వాతావరణశాఖ సూచించింది. నిన్న నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల పడటి ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది.
ఇక AP వ్యాప్తంగా 19 మండలాల్లో తీవ్రంగా, 54 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి.ప్రధానంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో లో 41.8, ప్రకాశం జిల్లా దరిమడుగు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 41.7, కడప జిల్లా మద్దూరు, ఖాజీపేటలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలో కూడా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe