
Heavy Rains: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో గత రెండ్రోజుల్నించి వాతావరణం మారింది. ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 2-3 రోజుల్లో ఏపీలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
ఉపరితల అవర్తనం కారణంగా ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
ఇక తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయి. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉన్నందున ఆరుబయట, చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాలు కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. రాష్ట్రంలోని అసిఫాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీమ్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
ముఖ్యంగా రానున్న వారం రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ వాతావరణం మారనుంది. సాయంత్రం నుంచి తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook