
Weather update Heavy rains and thunderstorms alert for ap: ప్రస్తుతం కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు వరుణుడు చుక్కలు చూపిస్తున్నారు. భారీగా కురుస్తున్న వానలకు జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. రోడ్లు చెరువులుగా, కాలనీలు కుంటలుగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏపీ వాతావరణశాఖ మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం.. బంగాళాఖాతంను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో.. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలలో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు,మెరుపులతో వానలు కురుస్తాయని హెచ్చరించింది.
ముఖ్యంగా రానున్న 3 గంటల్లో.. అల్లురీ సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడలకు ఏపీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. అదే విధంగా.. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఆరెంజ్ అలర్ట్, బాపట్ల, ప్రకాశం లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో.. అల్లూరి, పార్వతీపురం, కాకినాడ, యానాం, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో రానున్న 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరోవైపు.. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. అధికారులు సైతం ప్రజలు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook