)
Jagan On Montha Cyclone: మొంథా తుపాను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. "తుపాను నిర్వహణపై బాబుగారివి పిట్టలదొర మాటలు" అంటూ దుయ్యబట్టారు. మొంథా తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొవడంపై గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే పిట్టలదొర మాటల్లా ఉన్నాయంటూ జగన్ అన్నారు.
ప్రకృతి వైపరిత్యాలైన తుపానులు, వరదలు, కరువుకాటకాల వల్ల నష్టపోకుండా రైతుల కుటుంబాలకు అండగా ఉండే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయగా.. దాన్ని బెటర్ మేనేజ్మెంట్ ఎలా అవుతుందని సీఎం చంద్రబాబుపై జగన్ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాన్ని ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి, రైతుల గొంతు కోయడం వాస్తవం కాదా? అంటూ జగన్ అంటున్నారు.
తుపాను నిర్వహణపై బాబుగారివి పిట్టలదొర మాటలు!
ఇది Insensitive and Incompetent Governance!
Full details attached- https://t.co/h5EYnE97XX pic.twitter.com/rM42S9Ca4T
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2025
మొంథా తుపాను వల్ల సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు జగన్ చెప్పుకొచ్చారు. పంటల బీమాలేని రైతులకు దిక్కు ఎవరని, ఇది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుందని మాజీ సీఎం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తమకు తాముగా ఇన్సూరెన్స్ కట్టడం వల్ల కేవలం 19 లక్షల మందికి మాత్రమే బీమా పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు.
కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో సుమారు 16 సార్లు వైపరిత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అదే విధంగా రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయి పెట్టారని అన్నారు. ఇలాంటి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్ చేసినట్లు ఎలా అవుతుందని జగన్ ఎద్దేవా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook