జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం ఓడి పోయారు..ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరవదడం అసాధ్యమనుకుంటున్న సమయంలో అనూహ్య రీతిలో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ గెలుపు సాధించారు. తూగో జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి గా బరిగిలోకి దిగిన వరప్రసాద్ అది కూడా అతి కష్టం మీద గట్టిక్కారు.
చివరి రౌండ్ వరకూ ఎంతో ఉత్కంఠగా సాగిన రాజోలు ఓట్ల కౌంటింగ్లో స్వల్ప మెజార్టీతో వరప్రసాద్ గెలుపొందారు. దీంతో జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం దక్కినట్లయింది..శాసన సభలో అడుగుపెట్టి తమ వాయిస్ వినిపించే ఛాన్స్ దొరికినట్లయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి గెలుపొందటంతో పాటు పార్టీకి ప్రాతినిధ్యం లభించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. జనసేనకు ఇది తొలి అడుగు మాత్రమే అని, భవిష్యత్లో మరింత బలపడుతామని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన వరప్రసాద్కు పార్టీ అధినేత పవన్ అభినందనలు తెలిపారు.