కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి !

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి !

Last Updated : Feb 3, 2019, 08:14 PM IST
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి !

విజయనగరం: కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తాను ఇప్పుడిలా పార్టీకి రాజీనామా చేయాల్సి రావడం బాధాకరంగా ఉందని కిషోర్ చంద్రదేవ్ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే దిశగా కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని, వారి మధ్య ఉంటూ అందులో ఇమడలేకే తాను పార్టీ నుంచి బయటికి వెళ్తున్నానని చంద్రదేవ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడిన మీరు ఏ పార్టీలో చేరబోతున్నారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ''దేశాభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని, అటువంటి పార్టీలతోనే కలిసి వెళ్తాను''అని అన్నారు.

విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా పేరున్న వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలు అందించిన సంగతి తెలిసిందే.

Trending News