Lady devotee burns gods hundi notes with camphor in Pithapuram: ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తొంది. వచ్చే అమావాస్య వరకు కూడా చాలా మంది భక్తులు కార్తీక మాసం నేపథ్యంలో శివ, వైష్ణవ ఆలయాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది దీపాలు వెలిగిస్తారు. అగరవత్తులు వెలిగిస్తారు. దేవుళ్లకు మొక్కులు తీర్చుకుంటారు. ఇదంతా మనం చూస్తునే ఉంటాం.
ఇదేమీ భక్తి!
పిఠాపురంలో కర్పూరం వెలిగించి దేవుడి హుండీలో వేసిన భక్తురాలు.
హుండీ నుంచి పొగలు రావడం గమనించి నీళ్ళు పోసి అర్పిన ఆలయ సిబ్బంది.
కాలిన నోట్లను పక్కకు తీసి తడిసిన నోట్లను హెయిర్ డ్రయర్ తో ఆరబెట్టారు. pic.twitter.com/flGbLyPfOG
— greatandhra (@greatandhranews) November 9, 2025
కానీ ఇక్కడ ఒక అపర భక్తురాలు చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు. ఈ ఘఠన ఏపీలోని పిఠాపురంలో చోటు చేసుకుంది. పిఠాపురంలోని శ్రీదత్త స్వామి ఆలయంకు వచ్చిన ఒక భక్తురాలు స్వామికి కర్పూరం వెలిగించి ఆరతి ఇచ్చింది. మరీ ఆమెకు ఏమన్పించిందో ఏంటో కానీ.. ఆ వెలిగించిన కర్పూరం కాస్త హుండీలో వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాసేపటికి హుండీ లో నుంచి పొగలు వస్తుండటంతో అక్కడి సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే హుండీలో నీళ్లు పోశారు. ఆ తర్వాత హుండీని తెరిచారు. అప్పటికే అనేక నోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే అక్కడి సిబ్బందితో లెక్కింపు చేయించారు.
Read more: Pawan Kalyan Video: చిత్తూరులో పవన్ కళ్యాణ్ పర్యటన.. సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు.. వీడియో వైరల్..
ఆ తర్వాత నోట్లను బైటకు తీసి హెయిర్ డ్రాయర్ తో ఆరబెట్టారు. ఈ ఘటన తెలిసి అందరు అవాక్కయ్యారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి భక్తిరా బాబు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









