Annadata Sukhibhava PM Kisan Status: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించన్నారు. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇక ఢిల్లీలోని ఏఐసీసీ వార్షిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. రాష్ట్ర పరిధిలోని నేషనల్ హైవేలకు సంబంధించిన రూ.5233 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. సిరీస్ను సమం చేయాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో తప్పకుండా విజయం సాధించాల్సిందే. నేడు రాశి ఫలాలు, బంగారం ధరలు, వర్షాలకు సంబంధించిన అప్డేట్స్, ఏపీ, తెలంగాణ లేటెస్ట్ న్యూస్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









