AP Budget 2025 LIVE: ఏపీ బడ్జెట్‌పై ప్రభుత్వం అదిరిపోయే ప్రకటనలు.. ఏ స్కీమ్‌కు ఎన్ని నిధులంటే..?

AP Budget Session 2025 Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నేడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను  సభలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 28, 2025, 11:59 AM IST
AP Budget 2025 LIVE: ఏపీ బడ్జెట్‌పై ప్రభుత్వం అదిరిపోయే ప్రకటనలు.. ఏ స్కీమ్‌కు ఎన్ని నిధులంటే..?
Live Blog

AP Budget Session 2025 Live Updates: చంద్రబాబు సర్కారు ఏపీ బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెబోతుంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేడు ఉదయం 10 గంటలకు సభలో బడ్జెట్ ప్రసంగం మొదలవుతుంది. అంతకుముందు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రూ.3.24లక్షల కోట్ల అంచనాలతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో రూ.2.94 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గత బడ్జెట్‌ కంటే ఈసారి 10 శాతం అధిక అంచనాలతో బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు సమాచారం. ఏయే శాఖలకు ఎంత కేటాయించనున్నారు..? ఏ పథకాలను ఎన్ని నిధులు ఇవ్వనున్నారు..? ఏపీ బడ్జెట్ ఎలా ఉండబోతుంది..? లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

 

28 February, 2025

  • 11:59 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: పశుసంవర్ధన శాఖకు రూ.1,112 కోట్లు

    ==> ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.12,773 కోట్లు
     

  • 11:50 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ స్కీమ్ అమలుకు రూ.9400 కోట్లు

    ==> ఉద్యానశాఖకు రూ.930 కోట్లు

    ==> గ్రోత్ ఇంజన్లుగా 11 పంటలు

    ==> ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి రూ.61 కోట్లు

    ==> మార్కెటింగ్ శాఖకు రూ.315 కోట్లు

    ==> సహకార శాఖకు రూ.239 కోట్లు

  • 11:41 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: 35.8 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేశాం..

    ==> కిసాన్ డ్రోన్ వ్యవసాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం..

    ==> వ్యవసాయం యాంత్రీకరణ కోసం రూ.219 కోట్లు

    ==> పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం రూ.250 కోట్లు

  • 11:38 AM

  • 11:31 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: వ్యవసాయం యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు

    ==> ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు

    ==> టెక్నాలజీ ఉపయోగించి సాగు ఖర్చులను తగ్గించాలని మా లక్ష్యం

    ==> వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది

  • 11:22 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: వ్యవసాయ వృద్ధిరేటు 22.8 శాతం

    ==> సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ పథకంతో భూసార పరీక్ష పత్రాలను అందించాం..

    ==> రైతులు అధిక ఆదాయం వచ్చే పంటలు పండించాలి

    ==> 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు సూక్ష్మ పోషకాల పంపిణీ

  • 11:18 AM

  • 11:16 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. రూ.48 కోట్లతో వ్యవసాయం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

  • 11:11 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు

    ==> మద్యం, డ్రగ్స్ రహితంగా మార్చే నవోదయ 2.O కోసం రూ.10 కోట్లు

    ==> నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు

    ==> ఆదరణ పథకం కోసం రూ.వెయ్యి కోట్లు

    ==> ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు

  • 11:03 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కీలక కామెంట్లు చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల.

    ==> గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి.

    ==> వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చిన పయ్యావుల.

    ==> తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు.

    ==> చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.

    ==> అప్పులు చేయడమే తప్ప.. అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం.

    ==> వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు.

    ==> కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదు.

  • 11:00 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: మత్స్యకార భరోసా కోసం రూ.450 కోట్లు

    ==> పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు

    ==> మహిళా శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు

  • 10:53 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు
    ==> చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు
    ==> స్వచ్ఛ ఆంధ్రకు రూ.820 కోట్లు
    ==> సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
    ==> రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన రూ.500 కోట్లు

  • 10:51 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: వివిధ అభివృద్ధి పథకాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించిన కూటమి ప్రభుత్వం.

    ==> డ్రిప్ ఇరిగేషనుకు పెద్ద పీట.

    ==> 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు.

    ==> గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు.

    ==> గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు వంటి 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్టు బడ్జెట్‌లో వెల్లడి.

    ==> 4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సి.సి.రోడ్లల్లో, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తైనట్టు స్పష్టీకరణ.

    ==> మిగిలిన 1300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నట్టు బడ్జెట్‌లో ప్రస్తావన.

    ==> నరేగా ద్వారా 72 లక్షల మందికి ఉపాధి.

    ==> పోలవరం-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రణాళికలు.

    ==> 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించేలా పనులు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం.

    ==> ఇప్పటికే హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల వెడల్పు చేసే పనులు ప్రారంభమైనట్టు బడ్జెట్‌లో స్పష్టీకరణ.

    ==> పాట్‌హోల్‌  ఫ్రీ ఆంధ్ర నినాదంతో గణనీయమైన పురోగతి.

    ==> మరమ్మతులు చేపట్టిన 20,059 కిలోమీటర్లలో, 17,605 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేసినట్టు బడ్జెట్‌లో ప్రస్తావన.

  • 10:49 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.6,705 కోట్లు

    ==> హంద్రీనీవా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు

    ==> తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు

    ==> దీపం 2.O కోసం రూ.2,601 కోట్లు

  • 10:44 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లు

    ==> జల్‌జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు

  • 10:41 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: వైద్యారోగ్య శాఖకు రూ.19,265 కోట్లు

    ==> పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధికి రూ.18,848 కోట్లు

    ==> అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు

    ==> ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రూ.62 కోట్లు

  • 10:38 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.337 కోట్లు

    ==> ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.400 కోట్లు

    ==> ఆదరణ స్కీమ్ కోసం రూ.వెయ్యి కోట్లు

    ==> డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం రూ.3,486 కోట్లు

  • 10:34 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: అమరావతి నిర్మాణం కోసం రూ.6 వేల కోట్లు

    ==> రహదారుల నిర్మాణానికి రూ.4220 కోట్లు

    ==> జలవనరుల శాఖకు రూ.18,020 కోట్లు

    ==> పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు

    ==> రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10 కోట్లు

    ==> ఎన్టీఆర్ భరోసా కోసం రూ.27,518 కోట్లు

  • 10:31 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు

    ==> పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు

    ==> ఆర్థికంగా వెనుకబడిన వాళ్ల సంక్షేమానికి రూ.10,619 కోట్లు

    ==> రవాణా శాఖకు రూ.8,785 కోట్లు

    ==> ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు

    ==> సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు

  • 10:25 AM

     Andhra Pradesh Budget 2025 Live Updates: ==> బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు

    ==> ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు

    ==> ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు

    ==> బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు 

  • 10:21 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: రూ.3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్

    ==> రెవెన్యూ వ్యయం అంచనా- రూ.2,51,162

    ==> మూలధన వ్యయం అంచనా- రూ.40,635

    ==> రూ.48 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్

  • 10:17 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరిచేస్తున్నామన్నారు. గత పాలకులు జీతాలు కూడా సరిగా చెల్లించలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

  • 09:56 AM

  • 09:51 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: బడ్జెట్ పత్రాలతో అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద టీటీడీ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. 2025-2026 బడ్జెట్ పత్రాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలని వేడుకున్నారు.

     

  • 09:43 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: రాష్ట్ర బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

  • 09:05 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

    ==> బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్

    ==> ఉ.10 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న పయ్యావుల

    ==> మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కొల్లు రవీంద్రా 

    ==> వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న అచ్చెన్నాయుడు

    ==> మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నారాయణ

    ==> వార్షిక బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లకుపైగా ఉండే అవకాశం

    ==> వ్యవసాయ బడ్జెట్‌ రూ.50 వేల కోట్లు ఉండే ఛాన్స్

  • 08:51 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్ పూర్తయిన తరువాత వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
     

  • 08:40 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరిన మంత్రి పయ్యావుల

    ==> సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను అందచేయనున్న పయ్యావుల

    ==> కేబినెట్ భేటీలో బడ్జెట్టుకు ఆమోదం తెలపనున్న ప్రభుత్వం

  • 08:27 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలసి శాస్త్రోకంగా పూజలు నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి  జే.నివాస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్ పాల్గొన్నారు.

  • 08:25 AM

    Andhra Pradesh Budget 2025 Live Updates: ఏపీ బడ్జెట్ ఈసారి పేపర్‌లెస్‌గా ఉండనుంది. ఈ-బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రులకు ట్యాబ్‌లలో లోడ్ చేసి ఇవ్వనుండగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియాకు పెన్‌డ్రైవ్‌లో బడ్జెట్‌ లోడ్ చేసి ఇవ్వనున్నారు. బడ్జెట్ పుస్తకాల ఖర్చు ఎక్కువ అవుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
     

Trending News