Fire Breaks Out: బాణసంచా కేంద్రంలో 8 మంది అగ్నికి ఆహుతి.. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Massive Fire Breaks Out In Anakapalle Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మందుగుండు తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఇప్పటివరకు మంది మృతి చెందారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రమాద లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవే!

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 13, 2025, 04:09 PM IST
Fire Breaks Out: బాణసంచా కేంద్రంలో 8 మంది అగ్నికి ఆహుతి.. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
Live Blog

Anakapalle Fire Accident: ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రం ఉంది. ఆ కేంద్రంలో అకస్మాత్తుగా మధ్యాహ్నం సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు సామర్థ్యం కలిగిన పదార్థాలు మంటల్లో చిక్కుకుపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు.. భారీ మంటలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఏం జరిగిందో తెలియక స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఆ ప్రమాద ధాటికి 8 మంది మృతి చెందారని సమాచారం. కానీ మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలను అతి కష్టంగా అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతలతో మందుగుండు తయారీ కేంద్రంలో ప్రమాదం సంభవించినట్లు పోలీస్‌ ప్రాథమికంగా నిర్ధారించారు.

కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను హోంమంత్రి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు అడిగి వివరాలు తెలుసుకున్నారు.

13 April, 2025

  • 16:08 PM

    మృతులు వీరే..
    కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి వివరాలు లభించాయి. మొత్తం 8 మంది చనిపోగా.. ఆస్పత్రిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అదే గ్రామానికి చెందినవారితోపాటు సామర్లకోట, రాజపేట, విశాఖకు చెందిన వారు ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన వారికి విశాఖపట్టణంలోని కేజీహెచ్‌ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

    మృతులు
    ఎ.తాతబాబు (45), కైలాసపట్నం
    యాది గోవింద్‌ (45), కైలాసపట్నం
    దాడి రామలక్ష్మి (38), రాజపేట
    నిర్మల (38), సామర్లకోట
    పురంపాప (40), సామర్లకోట
    వేణుబాబు (40), సామర్లకోట
    సేనాపతి బాబురావు, చౌడువాడ
    మనోహర్‌ (30), విశాఖపట్టణం

  • 16:02 PM

    సంఘటనా స్థలానికి కలెక్టర్‌
    కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు. క్షతగాత్రుల కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అనంతరం కోటవురట్ల పీహెచ్సీని సందర్శించి క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవల కోసం విశాఖపట్టణంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని  కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.

  • 15:33 PM

    ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
    కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారని, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని సీఎం ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఘటనపై విచారణ చేసి తనకు నివేదించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అత్యవసరమైన అన్ని రకాల వైద్య సేవలు బాధితులకు అందేలా చూడాలని, బాధితుల ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

  • 14:51 PM

    ఆరుగురి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం నింపింది. సమాచారం తెలుసుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత కోటఉరట్ల ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అసలు ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలుసుకోనున్నారు. ఈ ప్రమాదంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని.. వీలైనంత స్పందనలో స్పందించి ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Trending News