Mekapati Goutham Reddy Funeral: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (50) సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అకాల మరణం అందర్ని షాక్ కు గురిచేసింది. దుబాయ్ నుంచి ఆదివారం వచ్చిన మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఆ రోజు రాత్రి ఓ శుభకార్యానికి కూడా హాజరయ్యారు. సోమవారం ఉదయం జిమ్ కు వెళ్లే ముందు ఆయనకు గుండెపోటుకు గురయ్యి.. ఇంట్లోని సోఫాలో కుప్పకూలిపోయారు. ఆ తర్వాత వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేకపాటి గౌతమ్ రెడ్డి మరణవార్త విని ఎంతోమంది ప్రముఖులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయన మృతికి ఎంతోమంది సంతాపాన్ని తెలియజేశారు. నెల్లూరు జిల్లా బ్రహ్మణపల్లిలో బుధవారం (ఫిబ్రవరి 23) ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని ఎయిర్ అంబులెన్స్ లో నెల్లూరుకు తరలించారు. గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు  తీసుకొచ్చి.. అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ (హెలికాప్టర్)లో తీసుకెళ్లారు. ప్రజలు, ఆయన అభిమానుల సందర్శనార్థం క్యాంపు కార్యాలయంలో భౌతికకాయాన్ని ఉంచనున్నారు.


మంత్రి గౌతమ్ రెడ్డి తనయుడు అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న కారణంగా.. అతడు వచ్చిన తర్వాత బుధవారం ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ముఖమంత్రి వైఎస్ జగన్ తో ఏపీ మంత్రివర్గం, ఎమ్మెల్యేలతో పాటు కొందరు తెలంగాణ మంత్రులు కూడా హాజరుకానున్నారు.   


Also Read: Breaking News: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం


Also Read: Mekapati Goutham Reddy: మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి కుటుంబం, చదువు, రాజకీయ జీవితం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook