Free Text Books: ఆ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఉచితంగా పాఠ్యపుస్తకాలు

Free Text Books to MJP Junior College Students:  మహాత్మా జ్యోతిబా పూలే జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ప్రకటించింది. స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్ అందజేయాలని నిర్ణయం తీసుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 23, 2025, 05:50 PM IST
Free Text Books: ఆ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఉచితంగా పాఠ్యపుస్తకాలు

Free Text Books to MJP Junior College Students: ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా పూలే) జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. 13 ఉమ్మడి జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్ వర్తింపజేయనున్నామని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత అధ్యక్షతన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక, ఆర్థికేతర సంబంధమైన 36 అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించగా, మరికొన్ని అంశాలపై ఆమోదం తెలిపారు. ముందుగా టెన్త్, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై సిబ్బందిని మంత్రి సవిత ప్రశంసించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ మరింత పర్సంటేజీ సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికులు సిద్ధం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. 

Add Zee News as a Preferred Source

స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్

ఎంజేపీ స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు దశలవారీగా టీజీటీ స్కేల్ అందజేయాలని ఎంజేపీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెర్స్ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఎంజేపీ విద్యా సంస్థల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి అండగా నిలవాలని బోర్డు ఆఫ్ గవర్నెస్ సమావేశంలో నిర్ణయించారు. రూ.3 లక్షల నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాలకు రూ.10 వేలు అందించాలని సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అనుమతులు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు. 

130 గెస్ట్ టీచర్ పోస్టుల భర్తీ

2014-19 మధ్య ఏర్పాటు చేసిన 65 ఎంజేపీ విద్యా సంస్థల్లో గెస్ట్ పోస్టుల భర్తీకి బోర్డు సమావేశం నిర్ణయించింది. 65 విద్యా సంస్థల్లో 2 పోస్టుల చొప్పున్న 130 పోస్టులు భర్తీ చేయనున్నారు. అవరసరమైన కళాశాలల్లో అసిస్టెంట్ ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేయాలని సమావేశంలో ఆమోదం తెలిపారు.  వాటితో పాటు కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న 715 మంది ఉద్యోగుల పర్మినెంట్ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. 

బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటీకి శిక్షణ

ఎంజేపీలో ఇంటర్ చదివే విద్యార్థులకు నీట్, ఐఐటీలో శిక్షణివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకుగానూ రాష్ట్రంలో రెండు స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సెంటర్లను ఏర్పాటుపై చర్చించారు. సీబీఎస్ఈ విద్యా బోధన సాగిస్తున్న 24 ఎంజేపీ కళాశాల్లో అవసరమైన ల్యాబ్ లతో పాటు మౌలిక వసతుల కల్పనపైనా చర్చించారు. అత్యధిక మంది విద్యార్థులు ఉండే ఎంజేపీల్లో సెకండ్ పీఈటీలను కూడా నియామకంపైనా, రాష్ట్రంలో రెండు బీసీ హాస్టళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడంపైనా చర్చించారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో చర్చించారు.  

Also Read: Strait of Hormuz : హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసిన ఇరాన్.. భారత్ పై  ప్రభావం ఎంత.. !

Also Read: FD Scheme: ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టి చూడండి.. లక్షల్లో లాభాలు ఖాయం..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News