
AP Red Book: వైఎస్సార్సీపీ నేతలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్ వంటి నేతలు కేసుల్లో బుక్ అయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంతు వచ్చినట్టుంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాధవ్ కు భారీ షాక్ తగిలింది. మాధవ్ ఇంటికి పోలీసులు వచ్చి మార్చి 5వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గోరంట్ల మాధవపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 72, 79 కింద కేసు బుక్ చేశారు. తమ ముందు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి గురువారం రాత్రి పోలీసులు రావడం కలకలం రేపింది. అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగ్గా.. పోలీసులు అతడికి నోటీసులు అందించి వెళ్లిపోయారు. ఆ నోటీసుల్లో వచ్చే నెల 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఉంది. 2024లో వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు అందించారు. పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని ప్రధాన ఆరోపణ ఉంది.
తనకు ఇచ్చిన నోటీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందిస్తూ.. 'విజయవాడ పోలీసుల నోటీసు తీసుకున్నా. న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణకు సహకరిస్తా. విచారణ తేదీని మార్చమని కోరుతా' అని తెలిపారు. అనంతరం ఏపీలో సాగుతున్న కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఏపీలో అంతర్యుద్ధం రాబోతోంది. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు' అని ఆరోపించారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.