Pawan kalyan serious on pahalgam attack: జమ్ములోని పహల్గంలో ఉగ్రవాదులు దాడిని యావత్ భారత్ వాణి ఖండించింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నాయి. కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు తమ సపోర్ట్ ఉంటుందని చెప్పుకొచ్చాయి. ఈ క్రమంలో కొంత మంది నేతలు ఇప్పటికే భారత్ లోనే ఉంటూ.. ఇప్పటికి కూడా పాక్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
పొట్టి శ్రీరాములు జిల్లా మంగళగిరిలో సి.కె. కన్వెన్షన్ లో పవన్ కళ్యాణ్ పహల్గం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. అదే విధంగా.. ఉగ్రదాడిలో అసువులు బాసిన.. మధుసూదర్ రావు కుటుంబాన్ని కలిశారు. తమ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
That's our @PawanKalyan
The unapologetic Nationalist 🔥
విన్నారుగా.. ఇక్కడుండాలి అంటే ఈ దేశం మీద ప్రేమతో ఉండాలి..
లేదంటే అక్కడికి పోండి
సూడో సెక్యులరిజం పేరుతో పాకీ మద్దతుదారులుగా మారకండి pic.twitter.com/Me16RI6q2D— Eshwar Vishnubhotla (@Eswarkarthikeya) April 29, 2025
అదే విధంగా పార్టీ తరపున 50 లక్షలసాయంను వారి కుటుంబానికి అందజేశారు.ఈ క్రమంలో పవన్ కళ్యాన్ చాలా భావోద్వేగంతో మాట్లాడారు.ఏప్రిల్ 22న జరిగిన పహల్గం ఘటనలో.. 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారని చాలా ఎమోషన్ అయ్యారు. ఇప్పటికి కొంత మంది సో కాల్డ్ సెక్యులిస్టులు అని చెప్పుకునే వారు.. పాక్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని.. వీళ్లలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారన్నారు. మనదేశంలో ఉండి.. తిన్నింటి వాసలు లెక్కపెట్టడం ఎందుకు.. అక్కడే వెళ్లి ఉండండని పవన్ అన్నారు.
ముఖ్యంగా మతంపేరు తెలుసుకుని మరీ దారుణానికి పాల్పడ్డారని అన్నారు. ఉగ్రమూకల్ని ఎరివేసే ప్రతి చర్యలలో కేంద్రానికి ఏపీ అండగా ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రచర్యల్ని వదిలే ప్రసక్తిలేదని పవన్ స్పష్టం చేశారు. ఒక వేళ ఎవరికైన పాక్ చర్యలు నచ్చితే.. హ్యాపీగా అక్కడే వెళ్లి ఉండొచ్చని పవన్ శివాలెత్తిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter