)
Srikalahasthi Chairman Post: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పదవుల భర్తీని దశలవారీగా చేపడుతోంది. ఈ క్రమంలోనే కొన్ని ఆలయాల పాలకమండలి కమిటీలను ప్రభుత్వం నియమించింది. వీటిలో ఓ సామాన్య కార్యకర్తకు అవకాశం లభించింది. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీలోని సామాన్య కార్యకర్తకు నామినేటెడ్ పదవి ఇప్పించారు. ఒక నాడు పోలీసు చేతిలో చెంపదెబ్బలు తిన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఓ ప్రముఖ ఆలయానికి చైర్మన్గా ఎంపికయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ పదవిని ఏపీ ప్రభుత్వం నియమించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కొట్టే సాయిప్రసాద్ని నడిరోడ్డుపై పోలీసు అధికారిణి చెంప దెబ్బ కొట్టి అవమానించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ శ్రీ సాయికి అండగా నిలుస్తూ తిరుపతి ఎస్పీ దగ్గర ఫిర్యాదు చేశారు. అతడికి అండగా నిలుస్తూ న్యాయ పోరాటం చేశారు. పార్టీ తరఫున పోరాటం చేసిన సాయిప్రసాద్కు తాజాగా ప్రభుత్వం నామినేటెడ్ పదవి కల్పించారు.
జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కల్యాణ్ బాటలో నడిచిన సామాన్య కార్యకర్తకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కింది. శ్రీకాళహస్తికి చెందిన కొట్టే సాయి ప్రసాద్ను జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్కి ప్రతిపాదించారు. పవన్ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపి సాయి ప్రసాద్ పేరును ప్రకటించింది. దీంతో జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2023లో శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ నిరసనలో పాల్గొన్న జనసేన పార్టీ కార్యకర్తలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ సందర్భంలో కొట్టే సాయిపై అప్పటి సీఐ శ్రీమతి అంజు యాదవ్ చెంపదెబ్బ వేసి అతడిని అవమానించారు. ఆమె కొడుతున్నా మహిళా అధికారిణి అని గౌరవించి సాయి ప్రసాద్ అలాగే నిలిచి ఉన్నారు.
ఆ ఘటన జరిగిన రోజున తాడేపల్లిగూడెం సమావేశంలో ఉన్న పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. ఆ తరవాత కొట్టే సాయిని, నాయకులను వెంటబెట్టుకొని తిరుపతి వెళ్లిన పవన్ కల్యాణ్ ఎస్పీని కలిసి పోలీసుల చర్యపై ఫిర్యాదు చేశారు. ఆ రోజు పోలీసులు కొట్టినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన కొట్టే సాయిని గుర్తించిన పవన్ కల్యాణ్ నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. పార్టీ కోసం నిలిచే కార్యకర్తలు, నాయకులను గుర్తించి బాధ్యతలు ఇచ్చేలా పవన్ కల్యాణ్ చొరవ తీసుకుంటారని నిరూపితమవుతోందని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook