పవన్ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థి బాలకృష్ణ

జనసేన పార్టీలో చేరిన బాలకృష్ణ

Last Updated : Sep 11, 2018, 04:42 PM IST
పవన్ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థి బాలకృష్ణ

తెలంగాణలో ముందస్తు ఎన్నికల సెగ.. ఏపీకి తాకుతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి పోటీచేసే తొలి అభ్యర్థిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పితాని బాలకృష్ణ తదితరులు జనసేనలో చేరారు.  ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. అంబేద్కర్ గొప్పవారని, ఆయన్ను  ప్రేమిస్తానని, ఆయన ఆశయాల సాధనకు తన వంతు కృషి చేస్తానన్నారు. పితాని లాంటి బలమైన నాయకుడు పార్టీకి ఎంతో అవసరమన్నారు.

ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి బి-ఫారం అందుకునే మొదటి వ్యక్తి పితాని బాలకృష్ణ అని పవన్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ స్థానాన్ని పితాని బాలకృష్ణకు కేటాయించినట్లు జనసేనాని వెల్లడించారు. ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు.

Trending News