
YSR Congress Party: 'పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడారు. అధికారుల చెప్పిన సమాచారం లోపం లేదా మీకు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు' అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. పోలవరం పెండింగ్కు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అని ప్రకటించారు. నదిని మళ్లింపు చేయకుండా.. గోదావరి నీటిని మళ్లించకుండా కాఫర్ డామ్ ఎలా కడుతున్నాడు? అని ప్రశ్నించారు. పాపం మంత్రులు మీరు చెప్పినవి అబద్దమని చెప్పలేరు అని తెలిపారు. తాము ఇది తప్పు అంటే చంద్రబాబుకు కోపం వస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. నీటి ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తప్పులు ఎత్తి చూపిస్తే కేసులు పెడతారని తెలిపారు. పోలవరం డ్యామేజి అంతా చంద్రబాబు వల్లే జరిగిందని ప్రకటించారు. 'కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చామని చెబుతున్నా.. 2023లో వైసీపీ నీరు ఇచ్చిన మాట వాస్తవమా కాదా?' అని బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు.
'వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే పోలవరం మళ్లీ మొదలైంది. 2005లోనే స్పిల్ వే పనులు మొదలయ్యాయి. కేంద్రం నిర్వహిస్తామంటే మేము చేసుకుంటామని చెప్పి అతిపెద్ద చారిత్రక తప్పు చేశారు' అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. 'భారీగా పోలవరం బడ్జెట్ పెంచారు. ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని ఇలా చేశారు' అని తెలిపారు. ఆ తప్పు సరిదిద్దేందుకు తమకు ఐదేళ్లు పట్టిందని చెప్పారు.
'వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ రూ.50 వేల కోట్లకు కేంద్రాన్ని ఒప్పించాం. ఎంత అన్యాయం మీరు పోలవరాన్ని పూర్తి చేశామని చెప్పడం' అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. 'రైతులకు యూరియా లెక్కలు తప్పులు తడక గా చెప్తున్నారు. ప్రతిపక్షం ఉండకూడదు మాట్లాడకూడదు అని అనుకుంటున్నారు. ఎరువుల రవాణా ను ఎవరు అడ్డుకుంటున్నారు' అని వివరించారు. కలెక్టర్ల సమావేశంలో యూరియా సరఫరాలో విఫలమయ్యామని చంద్రబాబు స్వయంగా చెప్పారని తెలిపారు.
'ఏపీలో పలు ప్రాంతాల్లో రైతుల క్యూ లైన్లలో యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికల్లో పోలింగ్ క్యూ లాగా రైతులు ఎరువుల కోసం వేచిచుస్తున్నారు. కేంద్రాన్ని గట్టిగా అడగకుండా ఏమి చేస్తున్నారు. టీడీపీ నేతలు వచ్చిన యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునేందుకు తరలించుకున్నారు. అందుకే కొరత ఏర్పడింది' అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook