Simhachalam: సింహాచలం ఘటనకు ప్రధాన కారణం ఇదే? మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..

Simhachalam Tragedy Reasons: సింహాచలంలో ఘోర ప్రమాదం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ చందనోత్సవం వేళ అపశృతి చోటు చేసుకుంది. సింహాచలంలో గోడకూలి 8 మంది మృతి చెందారు. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. 

Written by - Renuka Godugu | Last Updated : Apr 30, 2025, 09:38 AM IST
Simhachalam: సింహాచలం ఘటనకు ప్రధాన కారణం ఇదే? మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..

Simhachalam Tragedy Reasons: సింహాచలం అప్పన్న చందనోత్సవం వేడుకల్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. భారీ వర్షానికి గోడ కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరగడం బాధాకరమని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు మంత్రి ఆనగానే సత్య ప్రసాద్ తెలిపారు. 

అయితే, సింహాచలం ఆలయం వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు స్వామివారి నిజరూప దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో రూ 300 టికెట్ క్యూ లైన్ కు వెళ్లే మార్గంలో కాంప్లెక్స్ వద్ద రాత్రి నిద్రపోయారు. వారంతా గాఢ నిద్రలో ఉండగా సుమారు 2 గంటల సమయంలో పక్కనే కొత్తగా నిర్మించిన ఓ గోడ భారీ వర్షానికి కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా వారిపై పడింది. దీంతో భక్తులు శిథిలాల కింద చిక్కుకొని తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారు. 

ప్రధానంగా గోడ కూలి సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లిన భక్తులు మృతి చెందారు. అయితే గోడ వద్ద ఓ భారీ టెంట్ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున వచ్చిన భారీ ఈదురు గాలులకు ఆ టెంట్ గోడ పై పడటంతో అది కూలి విషాదం నెలకొన్నట్లు ప్రాథమిక సమాచారం. అప్పన్న చందనోత్సవంలో భాగంగా 20 రోజుల కిందటే ఆ గోడ నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి అసలు కారణం ఇదేనా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. 

ఇటీవల కట్టిన గోడ కూలి ఇంతమంది చనిపోవడంతో కాంట్రాక్టర్, అధికారులపై ఆగ్రహావేషాలు వ్యక్తం అవుతున్నాయి. రూ. 300 టికెట్ క్యూ లైన్ కాంప్లెక్స్ అనుసంధానం చేస్తూ గోడ నిర్మాణం చేపట్టారు. కాంక్రీట్ బీమ్‌ నిర్మించకుండా 20 అడుగుల కూడా కట్టారు. భారీ వర్షానికి నీరు మట్టి కొట్టుక రావడంతో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా గోడకూలి భక్తులపై పడింది. 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అధికారులు గోడకు ఇరువైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో రాళ్లు నేరుగా భక్తులపై పడకుండా ఆ ఫెన్సింగ్ అడ్డుకుంది. ఒకవేళ ఆ ఫెన్సింగ్ లేకపోతే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని తెలుస్తోంది. 

READ ALSO:  ఆషాడం బోనాల తేదీలు వచ్చేశాయి.. 2025 తెలంగాణ బోనాల షెడ్యూల్‌ ఇదే..  

 ఇదిలా ఉండగా ఈ ఘటనకు పై విచారణకు ఆదేశించినట్లు మంత్రి ఆనం నారాయణరెడ్డి వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ దేవదాయ శాఖలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గాయపడినవారికి రూ3 లక్షలు చొప్పున చెల్లించననున్నారు.

READ ALSO: ఖరీదైన క్రీములు అవసరం లేదు.. ఈ డ్రైఫ్రూట్‌ మాస్క్‌ వేసుకుంటే చాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News