Tirumala Darshan Tickets Cheating: తిరుమలలో ఇటీవల భక్తులు రద్దీ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ టీటీడీ రాజకీయ నేతల నుంచి సిఫారసుల లెటర్లను తిరిగి తీసుకుంటామని ప్రకటించింది. దీంతో మరల ఒక్కసారిగా తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
అయితే.. తిరుమలలో ఇటీవల దర్శనం టికెట్ ల విషయంలో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీవీ విజిలెన్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న కూడా.. కొంతమంది అవినీతి వాళ్ల వల్ల.. మోసాలు జరుగుతునే ఉన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన కొంత మంది భక్తులు అడ్డంగా దళారుల చేతిలో మోసపొయారు. వర్షా ట్రావెల్స్ ద్వారా వచ్చిన 35 మంది భక్తులు ఇటీవల ఒక ట్రావెల్స్ నుంచి శ్రీవారి దర్శనం కోసం టికెట్లను కొనుగోలు చేశారు.
ఒక్కొక్కరి నుంచి రూ. 4000 వరకు వసూలు చేశారు. క్యూలైన్లో టీటీడీ అధికారుల టికెట్లను తనిఖీలు చేయగా అవి నకిలీవని విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భక్తుల తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఎంతో దూరం నుంచి భక్తులు వ్యయప్రయాసాలకు పడి వచ్చామని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ దళారుల్ని, ట్రావెల్స్ వాళ్లను నమ్మకూడదని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై టీటీడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం తిరుమలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మొత్తంగా..ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ప్రస్తుతం తిరుమలలో.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ కోటా దర్శనం, సర్వదర్శనం వంటి అవకాశాల్ని భక్తులకు టీటీడీ అందిస్తుంది. అంతే కాకుండా.. ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేసి మరీ టీటీడీ భక్తులకు టికెల్ లను అందిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter









