)
Tirumala police filed case against ysrcp leader Ravindra nath reddy: తిరుమల శ్రీవారిని భక్తులు ఎంతో నమ్ముతుంటారు. మనదేశం నుంచి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఆలయంలో రాజకీయాలు, కాంట్రవర్సీ అంశాల గురించి మాట్లాడ వద్దని, ఇప్పటికే టీటీడీ పాలక మండలి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా.. శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలలో వివాస్పదంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ ఇప్పటికే హెచ్చరించింది.
ఈ క్రమంలో తిరుమలలో ఇటీవల మాజీ సీఎంజగన్ మేనమామ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆతర్వాత పులివెందులలో జరగబోయే ఎన్నికలపై మాట్లాడారు. కూటమి అసత్య హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలు వైసీపీని గెలిపించి కూటమికి బుద్ది చెప్పాలన్నారు. శ్రీవారి ఆలయంలో రాజకీయాలు మాట్లాడుతూ కాంట్రవర్సీ రాజేశారు.
దీనిపై టీటీడీ విజిలెన్స్ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.. తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో టీటీడీ ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసును నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు.
మరోవైపు పులి వెందుల జెడ్పీటీసీ ఎన్నికల్ని ఇటు కూటమి అటూ వైసీపీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో నువ్వా నేనా అన్న విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. కూటమి, వైసీపీ నేతలు ఒకరిపై మరోకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అదనపు బలగాల్ని రంగంలోకి దింపి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook