Tirumala Srivari Pushkarini Video: శ్రీవారి భక్తులకు పండగ లాంటి వార్త.. నెల తర్వాత పుణ్యస్నానాలకు పుష్కరిణిలోకి అనుమతిస్తున్న టీటీడీ.. వీడియో ..

Tirumala latest news:  తిరుమల పుష్కరిణిలోకి పుణ్యస్నానాలకు భక్తుల్ని మరోసారి టీటీడీ అనుమతిస్తుంది. గత నెల రోజులుగా అనేక మరమ్మత్తుల పనులు తర్వాత మరల పుణ్యాస్నానాలకు అనుమతించడంతో భక్తులు ఆనందంతో గోవింద నామస్మరణ చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 21, 2025, 06:46 PM IST
  • తిరిగి తెరుచుకున్న పుష్కరిణి..
  • ఆనందంలో భక్తులు..
 Tirumala Srivari Pushkarini Video: శ్రీవారి భక్తులకు పండగ లాంటి వార్త.. నెల తర్వాత పుణ్యస్నానాలకు పుష్కరిణిలోకి అనుమతిస్తున్న టీటీడీ.. వీడియో ..

Tirumala Srivari pushkarini reopened for devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరోసారి శుభవార్త చెప్పింది. దాదాపు నెల రోజులుగా స్వామివారి పుష్కరిణిని మరమ్మత్తుల నేపథ్యంలో తాత్కలికంగా మూసి వేశారు. ఈ క్రమంలో మరమ్మత్తులు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో భక్తుల్ని పుష్కరిణిలోకి టీటీడీ అనుమతిస్తుంది.

Add Zee News as a Preferred Source

సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.  ముఖ్యంగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో టీటీడీ సైతం తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది.

 

టీటీడీ జులై 20న పుష్కరిణి ఈ మర‌మ్మతు పనులు ప్రారంభించింది.  పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని మొదలైన వ్యర్థాల్ని తొలగించారు. అంతే కాకుండా పుష్కరిణి మెట్లకు, చుట్టుపక్కల అందంగా పెయింటింగ్ కూడా వేసి అందంగా తీర్చి దిద్దారు. అన్ని పనులు పూర్తి కావడంతో తిరుమల పుష్కరిణిలోకి మరల భక్తుల్ని అనుమతిస్తున్నారు.

ముఖ్యంగా స్వామి వారి పుష్కరిణిలో.. బ్రహ్మోత్సవాల సమయంలో చక్రస్నానం,ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణిలో అభిషేకం,మంగళ స్నానాదులు నిర్వహిస్తుంటారు.ఈ క్రమంలో స్వామి వారి పుష్కరిణిలో స్నానం చేస్తే తెలిసి, తెలియక చేసిన పాపాలు, సకల దోషాలు పోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

Read more: Br Naidu On Tirumala Darshan: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం.!. టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన..

అందుకే తిరుమలకు వచ్చిన వారంతా తప్పకుండా పుష్కరిణిలో స్నానంచేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. ప్రస్తుతం తిరుమల పుష్కరిణికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు గోవిందా.. గోవిందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News